logo

మాచర్లలో తెదేపా అనుచరుడి వాహనం ధ్వంసం

మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరి కారును శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. స్థానిక రింగురోడ్డు సమీపంలోని రైలుకట్ట వద్ద ఉప్పుతోళ్ల రమణ వాహనం నిలిపి ఉంచారు. వాహనం అద్దాలపై

Published : 23 Jan 2022 04:01 IST

మాచర్ల, న్యూస్‌టుడే: మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరి కారును శనివారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. స్థానిక రింగురోడ్డు సమీపంలోని రైలుకట్ట వద్ద ఉప్పుతోళ్ల రమణ వాహనం నిలిపి ఉంచారు. వాహనం అద్దాలపై తెదేపా నేతల చిత్రాలు ఉన్నాయి. రమణ శనివారం తన పనులపై నల్గొండకు వెళ్లారు. వచ్చే సమయానికి తెదేపా నేతల చిత్రాలున్న కారు అద్దాలను పగలగొట్టారు. దీనిపై పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు