గుంటూరు వాహినిలో మునిగి ఇద్దరు బాలురు మృతి
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాతమంగళగిరి దిగుడుబావి వద్ద నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు గుంటూరు వాహిని వద్దకు వెళ్లారు. రత్నాలచెరువు ప్రాంతంలో
మంగళగిరి, న్యూస్టుడే: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత పాతమంగళగిరి దిగుడుబావి వద్ద నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు గుంటూరు వాహిని వద్దకు వెళ్లారు. రత్నాలచెరువు ప్రాంతంలో వంతెనకు దిగువున కాలువలో ఈతకు దిగారు. కొద్ది సేపటికే వారు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న ట్రాన్స్జెండర్స్ వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. షేక్ మస్తాన్(13), షేక్ మున్సూర్ అక్మల్ (12)లు గల్లంతయ్యారు. సమాచారం తెలిసి డీఎస్పీ రాంబాబు, సీఐ అంకమ్మరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నివారణ దళం సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 4 గంటలకు పైగా శ్రమించిన తర్వాత బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను ఎన్ఆర్ఐ జనరల్ ఆస్పత్రికి శవపరీక్ష కోసం తరలించారు.
రెండు కుటుంబాల్లో విషాదం
బాలుర మృతి పాత మంగళగిరిలోని రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ పిల్లలు ఈత సరదాతో కాలువకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారంటూ తల్లిదండ్రులు రోదించారు.
కారు మెకానిక్గా పనిచేసే షేక్ తాజుకు ఇద్దరు మగపిల్లలు. ఆ కుటుంబం ఇటీవలే నవులూరు నుంచి వచ్చి పాతమంగళగిరిలో అద్దె ఇంటిలో ఉంటోంది. షేక్ మస్తాన్ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్న మస్తాన్ ఊహించని రీతిలో మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. వస్త్ర దుకాణం గుమస్తా అయిన షేక్ ఈసాకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన మున్సూర్అక్మల్ 7వ తరగతి చదుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య