logo

28 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏపీ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి 2021-22 విద్యాసంవత్సరానికి పది, ఇంటర్‌ తరగతుల్లో ప్రవేశం పొందేందుకు తత్కాల్‌ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా

Published : 25 Jan 2022 03:51 IST

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఏపీ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి 2021-22 విద్యాసంవత్సరానికి పది, ఇంటర్‌ తరగతుల్లో ప్రవేశం పొందేందుకు తత్కాల్‌ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈనెల 28 వరకూ సమర్పించవచ్చన్నారు. పదో తరగతి అభ్యర్థులు తత్కాల్‌ రుసుము రూ.300, ఇంటర్‌కు రూ.500 ఈనెల 31లోగా చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ ఎన్‌.బాబూరావును (8008403506 నెంబరులో) సంప్రదించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని