పెద్దాసుపత్రికి మరిన్ని హంగులు
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 15 ఆసుపత్రులను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించిన 15 దవాఖానాల్లో మంచిర్యాల జిల్లా పెద్దాసుపత్రి కూడా ఉంది. సంబంధిత పనులు టీఎస్ ఎంఐడీసీ (తెలంగాణ రాష్ట్ర
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే
ఆసుపత్రిలో జనరేటర్ సదుపాయం లేక చరవాణి వెలుతురులో వివరాలు నమోదు చేస్తున్న ల్యాబ్ సిబ్బంది (దాచినచిత్రం)
రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 15 ఆసుపత్రులను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించిన 15 దవాఖానాల్లో మంచిర్యాల జిల్లా పెద్దాసుపత్రి కూడా ఉంది. సంబంధిత పనులు టీఎస్ ఎంఐడీసీ (తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ)చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో రూ.10.84 కోట్లు కేటాయించగా.. మంచిర్యాలజిల్లా ఆసుపత్రికి ఎంత మంజూరు చేశారు, ఏఏ పనులు చేపట్టనున్నారనేది తెలియాల్సి ఉంది.
వెంటాడుతున్న అనేక సమస్యలు..
జిల్లా ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్లపై దృష్టిపెట్టాలి. ప్రతివార్డులో వీటి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కాలువలు కూడా అధ్వానంగా తయారయ్యాయి.
* ప్రధాన ద్వారాలు శిథిలావస్థకు చేరాయి. నూతన ద్వారాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
* విద్యుత్తు అంతరాయం.. ఆసుపత్రిలోని ల్యాబ్లకు ఇబ్బంది కలిగిస్తుంది. సరఫరా నిలిపివేసిన సమయంలో సేవలు నిలిచిపోతున్నాయి. జనరేటర్ సదుపాయం కల్పించేలా మరమ్మతులు చేపట్టాలి.
* ప్రస్తుతం కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న భవనాన్ని ఆధునికీకరించి సీబీనాట్ కేంద్రాన్ని తరలిస్తే ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాన ద్వారం వద్దే ఈ కేంద్రం ఉండటం, నమూనాలు బహిరంగంగానే తీస్తుండటం సమస్యగా మారింది. వ్యాప్తికి కారణమవుతోంది.
* పార్కింగ్ సైతం ఆసుపత్రికి తలనొప్పిగా మారింది. దీని కోసం శవపరీక్ష గదికి వెళ్లే దారిలోని ఖాళీ ప్రదేశంలో షెడ్డును ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- డా.అరవింద్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి
జిల్లా ఆసుపత్రి ఆధునికీకరణకు నిధులు మంజూరు అయినట్లు సమాచారం అందింది. వేటికి వచ్చాయి, ఏఏ పనులు చేపట్టాలి అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీఎస్ఎంఐడీసీకి సంబంధించిన అధికారి గురువారం పర్యటించనున్నారు. ఇక్కడి సమస్యలు, అత్యవసరంగా చేయాల్సిన పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లి చేపట్టేందుకు చొరవ చూపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 24-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పల్లెల్లో ప్లాట్లు.. కొన్నవారికి పాట్లు
[ 24-04-2024]
అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినా.. ‘రియల్’ దందా చేసే వ్యక్తులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలోని 396 పంచాయతీల్లో అధికారులు గుర్తించిన లేఅవుట్లు 419 ఉండగా.. ఇందులో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అనుమతులున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. -
ఏడుసార్లు ఎంపీ.. రెండుసార్లు ఎమ్మెల్యే
[ 24-04-2024]
గుడిసెల వెంకటస్వామిగా, కాకాగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి తెలంగాణ నుంచి అత్యధికంగా ఏడుసార్లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికైన నేతగా పేరు గడించారు. -
ఉక్కపోత.. చిన్నారుల వెత
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రక్షణ తీగలే.. యమపాశాలు
[ 24-04-2024]
రేయింబవళ్లు కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి జంతువుల కారణంగా చేజారుతున్నాయి. -
తునికాకు సేకరణకు వేళాయె..
[ 24-04-2024]
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు -
అక్రమ దందా.. అధికారుల అండ
[ 24-04-2024]
రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
గొలుసుకట్టు.. అక్రమాలతో కనికట్టు
[ 24-04-2024]
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా పదేళ్ల కిందట ఓ జిల్లా అధికారి నేతృత్వంలో సాగిన గొలుసుకట్టు వ్యాపారంలో తవ్వినకొద్దీ మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. -
ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
[ 24-04-2024]
వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని మంచిర్యాల జిల్లా పాలనాధికారి బి.సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లోని కలెక్టరేట్లో ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారామ్, -
25 నుంచి సార్వత్రిక పరీక్షలు..
[ 24-04-2024]
వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు