logo

వీఎంసీ కొత్త కమిషనర్‌గా రంజిత్‌ బాషా

విజయవాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా రంజిత్‌ బాషా రానున్నారు. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం సీసీఎల్‌ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా విధులు

Published : 26 Jan 2022 04:21 IST

ఈనాడు, అమరావతి: విజయవాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా రంజిత్‌ బాషా రానున్నారు. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం సీసీఎల్‌ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1975 ఆగస్టు 31న జన్మించిన బాషా స్వస్థలం కర్నూలు జిల్లా నందికొట్కూరు. బీఈడీ, కంప్యూటర్‌ సైన్స్‌, లెక్కల్లో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆయన తొలుత 2007లో గ్రూప్‌ 1కు ఎంపిక అయ్యారు. కడప, గుడివాడలో ఆర్డీవోగా పనిచేశారు. మండల రెవెన్యూ కార్యాలయాల కంప్యూటరీకరణ పీడీగా, నెల్లూరు జిల్లా జేసీ2, తెదేపా హయాంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌కు ఓఎస్డీగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం స్టేట్‌ సర్వీస్‌ కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తర్వాత పంచాయతీరాజ్‌ సంచాలకుడిగా, ఏపీఎస్‌ఐఆర్‌డి కమిషనర్‌గా, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. త్వరలో వీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుంటానని, అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని ‘ఈనాడు’తో మాట్లాడుతూ వివరించారు. కార్పొరేషన్‌ ప్రగతి పథంలో పయనించేందుకు తన వంతు పాటుపడతానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని