logo

డీబీపీఎస్‌ నాయకుడి దారుణహత్య..?

నగరానికి చెందిన దళిత బహుజన పరిరక్షణ సమితి(డీబీపీఎస్‌), ఎమ్మార్పీఎస్‌ నాయకుడు జె.వినోదరావు దారుణహత్యకు గురికావడం నగరంలో సంచలనం రేకెత్తించింది.

Published : 26 Jan 2022 04:21 IST

జె.వినోదరావు (పాతచిత్రం)

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: నగరానికి చెందిన దళిత బహుజన పరిరక్షణ సమితి(డీబీపీఎస్‌), ఎమ్మార్పీఎస్‌ నాయకుడు జె.వినోదరావు దారుణహత్యకు గురికావడం నగరంలో సంచలనం రేకెత్తించింది. ఈడేపల్లిలోని ఆయన నివాసగృహంలోని పోర్టికోకు ఉరివేసిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కుటుంబసభ్యులు మంగళవారం గుర్తించారు. అనుమానాస్పద మృతిగా సమాచారం అందుకున్న డీఎస్పీ మాసుంబాషా, చిలకలపూడి సీఐ అంకబాబు, ఇతర పోలీస్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోదరావు కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పాటు ఆయన నోట్లో గుడ్డలు కుక్కి, ఖర్చీఫ్‌తో కట్టేసి తల ప్లాస్టిక్‌ కవర్లతో కప్పేసి ఉండటం.... సంఘటనా స్థలంలో నేలపై కారంపొడి చల్లి ఉండటంతో ఆయన్ను హత్య చేసి ఉరి వేసినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని భావిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్‌లు ఆధారాలను సేకరించారని చిలకలపూడి సీఐ అంకబాబు ఆధ్వర్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఆయన మృతికి కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని