సామాజిక మాధ్యమాల్లో చూసి.. చోరీలు చేసి..
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులు నందిగామ పోలీసులకు చిక్కారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ కనకరావు వెల్లడించిన
పోలీసులకు చిక్కిన ఎనిమిదో తరగతి విద్యార్థులు
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను చూపిస్తున్న సీఐ
కనకారావు, ఎస్సై పండుదొర, సిబ్బంది
నందిగామ, న్యూస్టుడే: సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులు నందిగామ పోలీసులకు చిక్కారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ కనకరావు వెల్లడించిన వివరాల ప్రకారం... నందిగామలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు ఎనిమిదో తరగతి విద్యార్థులు పాఠశాల సెలవు రోజుల్లో తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. చోరీలు ఎలా చేయాలి... పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయాలను అంతర్జాలంలో చూసి తెలుసుకున్నారు. ఈనెల 22న కాకానినగర్లోని నల్లాని శ్రీనివాసరావు ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో మరో ఇంట్లో దొంగతనం చేస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. మొత్తం ఐదు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేసినట్లు తేల్చారు. చోరీ చేసిన నగదును పంచుకున్నారు. ఒకరు రూ.పది వేలతో సెల్ఫోన్ కొన్నాడు. మిగిలినవారు చిరు తిండ్లు బాగా తిన్నారు. బంగారం గాజులు, ఉంగరాలను ఎలా అమ్మాలో తెలియక దాచిపెట్టారు. విద్యార్థుల నుంచి రూ.2,49,000 విలువ చేసే 4 బంగారం గాజులు, 3 ఉంగరాలు, వెండి పట్టీలు, 2 సెల్ఫోన్లు రికవరీ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు ఆర్.నవీన్, పి.గోపాల్కు సీఐ కనకరావు రివార్డులు ఇచ్చి సత్కరించారు. ఎస్సై పండుదొర, ఏఎస్సై సామినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!