logo

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.1.76 కోట్లు

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు పదిహేను రోజుల్లో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. 29 హుండీల్లో కానుకలను లెక్కించగా రూ.1,76,44,969

Published : 26 Jan 2022 04:21 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు పదిహేను రోజుల్లో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. 29 హుండీల్లో కానుకలను లెక్కించగా రూ.1,76,44,969 ఆదాయం వచ్చింది. కానుకలతోపాటు 598 గ్రాముల బంగారం, 4.045 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దేవస్థానం ఉద్యోగులు, సేవా సిబ్బంది కానుకల లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, సభ్యురాలు నాగవెంకట వరలక్ష్మి పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని