అమరావతిలో కరపత్రాల కలకలం
రాజధాని అమరావతిని ప్రకటించిన తెదేపాను ఆ ప్రాంతంలోనే ఓడించడానికి కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ముద్రించి పడేసిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. గుర్తు
తుళ్ళూరు, న్యూస్టుడే: రాజధాని అమరావతిని ప్రకటించిన తెదేపాను ఆ ప్రాంతంలోనే ఓడించడానికి కారణం ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ముద్రించి పడేసిన కరపత్రాలు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రోడ్లపై వాటిని పడేసి వెళ్లారు. అందులో బీహార్ బ్యాచ్ నుంచి కాపాడుకుందాం, రండి మాతో కలిసి గళం విప్పండంటూ పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు పార్లమెంటులోని తుళ్ళూరు మండలంలో లోక్సభ స్థానానికి పడిన ఓట్లు అసెంబ్లీ సెగ్మెంట్కు ఎందుకు పడలేదో ఆ కరపత్రాల్లో ముద్రించారు. స్వలాభం, స్వార్థం, కుటిలనీతి, సొంత పనులు, గ్రామ కంఠాలు, మెట్ట-జరీబు భూమి తదితర అంశాలపై ప్రజల్లో ఏహ్య భావం ఏర్పడిందని అందులో తెలిపారు. ఇదంతా బీహార్ బ్యాచ్గా ముద్రపడిన పదిమంది వ్యక్తుల వల్లనేనన్న నిజాన్ని ఇకనైనా గ్రహించాలని కోరారు.
శ్రావణ్కుమార్కు వ్యతిరేకంగా
నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ వ్యతిరేక వర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండలంలోని అదే పార్టీకి చెందిన మరో వర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలోనూ శ్రావణ్కుమార్ను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్ఠానం వద్దకు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారని ఆ వర్గం గుర్తుచేసింది. దీనిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ ఆ వర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.