రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం
ఆర్టీసీ బస్సు, బొలెరో పికప్ (సరకు రావాణా వాహనం) ఢీకొని ఇద్దరు రైతులు దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో మంగళవారం చోటు చేసుకుంది..
సత్యన్న, జయారెడ్డి
దేవరక్రద గ్రామీణం, మరికల్, న్యూస్టుడే : ఆర్టీసీ బస్సు, బొలెరో పికప్ (సరకు రావాణా వాహనం) ఢీకొని ఇద్దరు రైతులు దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.. దేవరక్రద ఎస్సై భగవంతరెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన పాతర్చెడ్ సత్యన్న(49), అతడి తమ్ముడి కుమారుడు భరత్ మంగళవారం ఉదయం దేవరకద్ర మండలం డోకూరు సమీపంలో ఉన్న రైస్మిల్లుకు ధాన్యాన్ని బియ్యంగా మర ఆడించేందుకు బొలెరో వాహనంలో వెళ్లారు. తర్వాత బియ్యంతో రాకొండకు తిరుగు ప్రయాణమయ్యారు. దేవరక్రదలో సిలిండర్ తీసుకెళ్లేందుకు వచ్చిన రాకొండ గ్రామానికే చెందిన మిత్రుడు జయారెడ్డి(47)ని కూడా వాహనంలో ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలోని దేవరకద్ర మండలం పెద్దగోప్లాపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సును.. వీరి బొలెరో వాహనం ఢీకొంది. బొలెరో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బొలెరోలో ప్రయాణిస్తున్న రైతులు జయారెడ్డి, సత్యన్న అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో వెనుక ఉన్న భరత్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భరత్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో మహబూబ్నగర్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సత్యన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, జయారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు రైతులు చనిపోవటంతో రాకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.