logo

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోండి

గుంటూరు- చిలకలూరిపేట మధ్యలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖకు అనుబంధమైన ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నుంచి

Published : 26 Jan 2022 04:21 IST

కలెక్టర్‌కు ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ లేఖ

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరు- చిలకలూరిపేట మధ్యలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖకు అనుబంధమైన ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ మేరకు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం గతంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పలుమార్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ను కలిసి విన్నవించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 8.60 ఎకరాల భూమి గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు పంపారు. చిలకలూరిపేటలో స్పిన్నింగ్‌, జిన్నింగ్‌, పొగాకు పరిశ్రమలు అధికంగా ఉండడంతో కార్మికులు ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ క్రమంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర కార్మిక శాఖ మంత్రిని కోరిన నేపథ్యంలో ఆసుపత్రిని నడింపాలెం వద్ద నిర్మించేందుకు ఆమోదం వచ్చిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు