ప్రసవానికి ముందే పాప మృతి
ప్రసవానికి ముందే పాప మృతి చెందటానికి కారణం ఏరియా ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని మంగళవారం రాత్రి మృతి చెందిన పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు
హుజూర్నగర్: ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పాప బంధువులతో మాట్లాడుతున్న ఎస్సై వెంకటరెడ్డి
హుజూర్నగర్, న్యూస్టుడే: ప్రసవానికి ముందే పాప మృతి చెందటానికి కారణం ఏరియా ఆసుపత్రి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని మంగళవారం రాత్రి మృతి చెందిన పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంకు చెందిన పిండిప్రోలు లక్ష్మణ్ భార్య శ్రావణి గర్భవతి. శ్రావణి తల్లిదండ్రులది హుజూర్నగర్ కావటంతో ఏరియా ఆసుపత్రిలోనే మొదటి నుంచి పరీక్షలు చేయించుకుంటుంది. ప్రసూతి సమయం రావటంతో శ్రావణి సోమవారం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నుంచి నొప్పులు బాగా వస్తున్నాయని శ్రావణి ఆసుపత్రికి సిబ్బందికి చెప్పింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమె ఆపరేషన్ అవసరం లేకుండా డెలివరీ అవుతుందని చెప్పి ఆమెను సముదాయించారు. సాయంత్రం వరకు నొప్పులు తీవ్రంగా ఉండటంతో తాము వేరే ఆసుపత్రికి పోతామని చెప్పి ఆసుపత్రి వారికి రాసిచ్చి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి పోయారు. అక్కడ డాక్టర్ ఆమెకు శస్త్రచికిత్స కాకుండా ప్రసవం చేసి మృతి చెందిన పాపను బయటకు తీశారు. పాప చనిపోయిందని చెప్పటంతో పాప బంధువులు ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆందోళనకు దిగారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ: శ్రావణికి మామూలు ప్రసూతి అయ్యే అవకాశం ఉండటంతో అందుకోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వారు తాము వేరే ప్రైవేటు ఆసుపత్రికి పోతామని చెప్పి రాసిచ్చి వెళ్లిపోయారని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రి నుంచి వారు బయటకు పోయేటప్పుడు కూడా పరీక్షించామని పాప గుండె చక్కగా కొట్టుకుంటుందని తెలిపారు. వారికి నచ్చచెప్పినా వినకుండా పోవటం వల్ల పాప చనిపోయింది.. ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్