logo

వివాహిత ఆత్మహత్య

నగరంలోని మహానాడులో బుధవారం రాత్రి వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. సీలింగ్‌ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న సునీల్‌

Published : 27 Jan 2022 05:15 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: నగరంలోని మహానాడులో బుధవారం రాత్రి వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. సీలింగ్‌ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న సునీల్‌ మౌర్య కొంతకాలంగా విజయవాడలో ఉంటున్నారు. అక్కడ ఆయన భార్య శిఖాతో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబాన్ని తాడేపల్లిలోని మహానాడుకు మార్చారు. అప్పటికీ ఆ వ్యక్తి తాడేపల్లి వస్తుండడంతో ఇంట్లో వారితో చెప్పుకోలేక శిఖా చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహం జరిగి నాలుగేళ్లు కావడంతో మండల రెవెన్యూ అధికారి శవపంచనామా నిర్వహిస్తారని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని మంగళగిరిలోని ప్రభుత్వ వైద్యశాల శవాగారానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని