Andhra News: హిజాబ్ వివాదంపై స్పందించిన లయోలా కళాశాల ప్రిన్సిపల్
హిజాబ్ వివాదంపై విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ మీడియాతో
కరెన్సీ నగర్(విజయవాడ): హిజాబ్ వివాదంపై విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇద్దరు విద్యార్థినులు ఇవాళ హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చారు. తరగతి గదుల రౌండ్స్కు వెళ్తున్నప్పుడు వారిని గమనించాను. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశ్నించా. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులు నా వద్దకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడే నిబంధనలపై సంతకం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో తరగతి గదిలోకి అనుమతించాం. రేపటి నుంచి హిజాబ్ ధరించి రావాలా? వద్దా?అనేది నిర్ణయిస్తాం’’ అని ప్రిన్సిపల్ కిశోర్ అన్నారు.
ఈ ఉదయం ఇద్దరు బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చారు. వారిని చూసిన ప్రిన్సిపల్ హిజాబ్తో ఎందుకొచ్చారని.. దుస్తులు మార్చుకొని రావాలన్నారు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముస్లిం మత పెద్దలతో పాటు తల్లిదండ్రులు, పోలీసులు ప్రిన్సిపల్తో మాట్లాడారు. అనంతరం విద్యార్థినులను తరగతి గదుల్లోకి అనుమతించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు