Andhra News: వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల
పార్లమెంట్కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
దిల్లీ: పార్లమెంట్కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని చెప్పారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని అన్నారు. దిల్లీలో ఎంపీ రామ్మోహన్నాయుడితో కలసి కనకమేడల మీడియాతో మాట్లాడారు.
‘‘రాజ్యాంగాన్ని విశ్లేషించేందుకు కేంద్రం సుప్రీం కాదు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ప్రభుత్వాలు అంటే వ్యక్తులు కాదు సంస్థలు అని గుర్తించాలి. ప్రభుత్వాలు కొనసాగుతాయి.. వ్యక్తులు మారతారు. పార్టీలు మారితే రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదు. రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. జడ్జిలను బెదిరిస్తున్నారు, న్యాయవ్యవస్థలను దూషిస్తున్నారు. దీన్ని కోర్టుల పట్ల బెదిరింపు ధోరణితో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. చట్టాలను మార్చే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది. కోర్టు తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’’ అని కనకమేడల అన్నారు.
మద్యం మరణాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం రాజధాని అంశాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని రామ్మోహన్నాయుడు అన్నారు. మూడు రాజధానులని మూడేళ్లలో ఒక్కచోటైనా అభివృద్ధి చేశారా అని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో