logo

ట్రాక్టరు దూసుకొచ్చి పారిశుద్ధ్య కార్మికుడి దుర్మరణం

ఓ కంపెనీకి చెందిన ట్రాక్టర్‌ డెమో చూపుతున్న సమయంలో ఇంట్లోకి దూసుకెళ్లగా ప్రమాదంలో రామాంజనేయులు (50) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో చోటు చేసుకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..

Published : 05 Dec 2021 04:48 IST

రామాంజనేయులు (దాచిన చిత్రం)

శెట్టూరు, కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ కంపెనీకి చెందిన ట్రాక్టర్‌ డెమో చూపుతున్న సమయంలో ఇంట్లోకి దూసుకెళ్లగా ప్రమాదంలో రామాంజనేయులు (50) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో చోటు చేసుకొంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామంలోని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా రామాంజనేయులు పని చేస్తున్నారు. ఉదయం వీధులు శుభ్రం చేసి బస్టాండ్‌ సమీపంలో అక్కడే ఉన్న మిత్రులతో మాట్లాడుతున్నారు. ఓ ట్రాక్టర్‌ కంపెనీకి చెందిన వారు రైతులకు డెమో ఇస్తుండగా ఒకానొక సమయంలో ట్రాక్టర్‌లోని సాంకేతిక కారణాలతో వేగంగా అక్కడున్న వారి పైకి వచ్చి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడే కూర్చున్న రామాంజనేయులుకు తీవ్రగాయాలైయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలు కాగా రామాంజనేయులును చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. శెట్టూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కారణాలు ఆరా తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని