logo

విద్యుత్తు శాఖ ఏడీఈ మృతి

విద్యుత్తు శాఖ పుట్టపర్తి ఏడీఈ నరేంద్రబాబు గుండెనొప్పితో సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తరువాత 1.15 గంటలకు మృతి చెందారు. గత ఏడాది జులైలో తెలంగాణ నుంచి

Published : 05 Dec 2021 04:48 IST

పుట్టపర్తి గ్రామీణం : విద్యుత్తు శాఖ పుట్టపర్తి ఏడీఈ నరేంద్రబాబు గుండెనొప్పితో సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తరువాత 1.15 గంటలకు మృతి చెందారు. గత ఏడాది జులైలో తెలంగాణ నుంచి బదిలీపై పుట్టపర్తికి వచ్చారు. ఎనుములపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 2న ఉదయం ఛాతిలో నొప్పిగా ఉండటంతో సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పీలేరు. బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని