రేషన్ కోటా.. ప్రతినెలా కోత!
బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయి. పేదలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులతో ఊరట పొందుతున్నారు. అయితే నెలనెలా కోటా తగ్గిపోతోంది.
గోదాములో బియ్యం నిల్వలు
వరద బాధితులకు ఇచ్చారట
జిల్లాలో 3,012 చౌక దుకాణాలు ఉన్నాయి. 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 600 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 600 మెట్రిక్ టన్నుల పంచదార కేటాయింపులు జరిగాయి. అయితే రెండు నెలల నుంచి పంచదార, కందిపప్పు పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. అరకొర పంపిణీ చేస్తున్నారు. చక్కెర హైదరాబాద్ నుంచి, కందిపప్పు వినుకొండ నుంచి జిల్లాకు సరఫరా అవుతోంది. భారీ వర్షాలతో ఈనెల సరఫరా ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నవంబరు నెల భారీ వర్షాలు కురిశాయి. కదిరి రెవెన్యూ డివిజన్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. వారికి బియ్యం, కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేశారు. మొత్తం 6,615 మంది బాధితులకు కిలో చొప్పున కందిపప్పు పంచినట్లు అధికారులు తెలిపారు. కందిపప్పు వరద బాధితులకు పంచడం మంచిదేనని, తమ కోటా రద్దు చేయడం సరికాదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
27 శాతం పంపిణీ: జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. మొత్తం 12,03,438 తెల్ల కార్డుదారులు ఉన్నారు. శనివారం వరకు 3,32,713 కార్డులకు సరకులు ఇచ్చారు. అంటే 27 శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నెలనెలా సరకుల పంపిణీలో కొత విధిస్తూనే ఉన్నారని పలు మండలాల తహసీల్దార్లు చెప్పడం గమనార్హం.
సరఫరా ఆగింది
వెంకట్రాముడు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
వరదల కారణంగా పంచదార, కందిపప్పు సరఫరా ఆగిన విషయం నిజమే. కందిపప్పు కొంత నిల్వలు ఉండగా.. కొన్ని దుకాణాలకు సర్దుబాటు చేశాం. వరద ప్రాంతాల్లో బాధితులకు కందిపప్పు పంపిణీ చేశారు. ఈ నెలలో పంచదార సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రెండ్రోజుల్లో కందిపప్పు వస్తుంది. అన్ని దుకాణాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
జేసీ మాట: డిసెంబరు నెల కోటా సరకులు కార్డుదారులకు ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. బియ్యం, కందిపప్పు, చక్కెర ఇంటి వద్దే అందిస్తారు. ఆయా సరకులకు నిర్ణయించిన ధరలు చెల్లించి కార్డుదారులు తీసుకోవాలని గత నెల 30న జేసీ సిరి జారీ ప్రకటన ఇచ్చారు.
కార్డుదారుల ఆందోళన: బియ్యం తప్ప మిగతా సరకులు ఇవ్వలేదు. కందిపప్పు, చక్కెర అడిగితే డీలర్లు రాలేదని సమాధానం ఇస్తున్నారు. నవంబరు నెలలోనూ చక్కెర, కందిపప్పు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ