logo

ప్రాణం తీసిన ఈత సరదా

సరదా కోసం ఈతకు వెళ్లిన బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వాల్మీకీనగర్‌లో నివాసముంటున్న మల్లికార్జున, మంజుల దంపతుల పెద్ద కుమారుడు యశ్వంత్‌ (12) కళ్లీమఠం

Published : 15 Jan 2022 05:50 IST


యశ్వంత్‌ (దాచినచిత్రం)

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: సరదా కోసం ఈతకు వెళ్లిన బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వాల్మీకీనగర్‌లో నివాసముంటున్న మల్లికార్జున, మంజుల దంపతుల పెద్ద కుమారుడు యశ్వంత్‌ (12) కళ్లీమఠం పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు గురువారం బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తమ కుమారుడు కనిపించడంలేదని శుక్రవారం ఉదయం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. స్నేహితులను విచారించి ఈతకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. పట్టణ శివారు గౌడ లేఅవుట్‌లోని నీటికుంటలో గాలించి బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని