logo

మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయరామిరెడ్డి, సాలెవేముల బాబు డిమాండ్‌ చేశారు. పీఆర్సీ ప్రతులను భోగిమంటల్లో దహనం చేసి ప్రభుత్వ ప్రకటనపై నిరసన

Published : 15 Jan 2022 05:50 IST


భోగిమంటల్లో పీఆర్పీ ప్రతులు దహనం చేస్తున్న ఉపాధ్యాయసంఘాల సమాఖ్య నాయకులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయరామిరెడ్డి, సాలెవేముల బాబు డిమాండ్‌ చేశారు. పీఆర్సీ ప్రతులను భోగిమంటల్లో దహనం చేసి ప్రభుత్వ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదికను వెల్లడించాలని, 27 శాతం కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కోఛైర్మన్లు నాగేంద్ర, రమణారెడ్డి, సిరాజుద్దీన్‌, రవీంద్ర, ప్రధాన ఉపకార్యదర్శులు ఓబులేసు, పెద్దన్న గోపాల్‌రెడ్డి, సుధాకర్‌ తదితరులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని