logo

300 మందికి పాజిటివ్‌

జిల్లాలో కరోనా కేసులు 300 నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 1,075 నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుతున్నాయి. నాలుగు రోజులుగా అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా

Published : 15 Jan 2022 05:50 IST

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కేసులు 300 నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 1,075 నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుతున్నాయి. నాలుగు రోజులుగా అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,59,514 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 1,57,346 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. వివిధ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 1,075 మంది చికిత్స పొందుతున్నారు. రెండు విడతల్లో కలిపి 1,093 మంది మృత్యువాత పడ్డారు. 
కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,320 పడకలు 
అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలోని 33 కొవిడ్‌ ఆసుపత్రుల్లో మొత్తం 3,320 పడకలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. వీటిలో 457 ఐసీయూ పడకలు, 2,115 ఆక్సిజన్‌ పడకలు, సాధారణ పడకలు 748 ఉన్నాయి. 30 మంది కరోనా రోగులు జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో నలుగురు, ఆక్సిజన్‌పై 26 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 3,290 పడకలు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు