‘నకిలీ బంగారు నాణేల’ ముఠా అరెస్టు
నకిలీ బంగారు నాణేలతో తెలంగాణ వాసులను మోసం చేసిన కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10లక్షలు, కారు, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగర
రూ.10 లక్షలు, వాహనాలు స్వాధీనం
అనంత నేరవార్తలు, న్యూస్టుడే: నకిలీ బంగారు నాణేలతో తెలంగాణ వాసులను మోసం చేసిన కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10లక్షలు, కారు, ద్విచక్ర వాహనం, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగర ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాద్రెడ్డి గ్రామీణ పోలీసు స్టేషనులో బుధవారం సమావేశం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా హర్పనహళ్లి తాలూకా మాచెహళ్లి కొరచరహట్టి గ్రామానికి చెందిన విజయ్కుమార్, అశోక్, దివాకర్ మిత్రులు. వీరు మద్యానికి బానిసలు. వ్యసనాలు తీర్చుకొనేందుకు కావలసిన డబ్బు కోసం సులువైన మార్గంగా నకిలీ బంగారం నాణేల విక్రయాన్ని ఎన్నుకున్నారు. వీటికోసం ప్రత్యేకంగా పథకం రచించారు. ఇళ్ల పునాదుల తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికాయని, వీటిని తక్కువ ధరకే విక్రయిస్తామని ముందుగా సేకరించుకున్న నెంబర్లకు ఫోన్ చేసి మాయమాటలు చెబుతారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పరమేష్, మహేష్ను ఫోన్లో నమ్మించారు. వీడియోకాల్ ద్వారా ఒక అసలైన బంగారు నాణెం చూపించి.. తమ వద్ద ఒకటిన్నర కిలో నాణేలు ఉన్నాయని నమ్మించారు. వాటిని కేవలం రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 14న మహేష్, పరమేష్కు ఫోన్ చేసి అనంతపురం నగర శివారులోని వైఎస్సార్ కాలనీకి రావాలని చెప్పారు. అనుకున్న విధంగానే అందరూ కురుగుంట వద్దకు చేరుకున్నారు. ముఠా సభ్యులు తెల్లని గుడ్డ సంచిని బాధితులకు ఇచ్ఛి. అందులో నాణేలు పరీక్షించుకోమన్నారు. వారు నాణేలను పరీక్షించే లోపే.. బాధితుల చేతిలో ఉన్న రూ.10లక్షలు, సెల్ఫోన్లు లాక్కొని ముఠా సభ్యులు ద్విచక్రవాహనంలో పరారయ్యారు. ఈ మోసంపై అనంత గ్రామీణం స్టేషనులో కేసు నమోదైంది.
F ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో గ్రామీణం సీఐ మురళీధర్రెడ్డి, ఎస్సైలు మహానంది, కమలాబాషా, ఏఎస్సై వెంకటేష్, సిబ్బంది బృందంగా ఏర్పడి ముఠా వ్యవహారంపై నిఘా వేశారు. పక్కాగా వచ్చిన సమాచారంతో ముగ్గురు ముఠా సభ్యులను స్థానిక సీఆర్ఐటీ కళాశాల వద్ద పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.
పట్టుబడిన నగదు, నకిలీ నాణేలు, చరవాణులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు