ఉరిమిన ఉపాధ్యాయులు
జిల్లా ఉపాధ్యాయ లోకం పిడికిలి బిగించింది.. తమ సమస్యలపై ఉద్యమించింది.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది.. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్, ఇంటి అద్దె స్లాబుల తగ్గింపుపై భగ్గుమంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురువులు ఆగ్రహించారు. సీఎం డౌన్..డౌన్ అంటూ కదం తొక్కారు. . ఏపీ ఉపాధ్యాయ సంఘా
దద్దరిల్లిన కలెక్టరేట్
కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు
వివిధ సంఘాల నాయకుల అరెస్టు
కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘ నాయకులు
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: జిల్లా ఉపాధ్యాయ లోకం పిడికిలి బిగించింది.. తమ సమస్యలపై ఉద్యమించింది.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది.. కొత్త పీఆర్సీ ఫిట్మెంట్, ఇంటి అద్దె స్లాబుల తగ్గింపుపై భగ్గుమంది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గురువులు ఆగ్రహించారు. సీఎం డౌన్..డౌన్ అంటూ కదం తొక్కారు. . ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) జిల్లా ఛైర్మన్ జయరామిరెడ్డి, సెక్రటరీ జనరల్ సాలెవేముల బాబు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడించారు. ఉదయం 9 గంటలకే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు కలెక్టర్ కార్యాలయ ప్రధాన గేటు వద్ద బెంగళూరు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. అప్పటికే ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాద్రెడ్డి సారథ్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు మూడంచెల బారీకేడ్లను ఏర్పాటు చేశారు.
ఇది పచ్చి మోసం
ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్, సెక్రటరీ జనరల్ జయరామిరెడ్డి, బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల అనుకూల ప్రభుత్వమని భావించాం. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఐఆర్తోనే సరిపెట్టుకున్నాం. తీరా 11వ పీఆర్సీ నివేదికను పూర్తిగా పక్కనపెట్టి.. అధికారుల కమిటీ ఆధారంగా ఫిట్మెంట్ 23 శాతం మాత్రమే ఇవ్వడం చాలా అన్యాయం. ఇది పచ్చి మోసమని మండిపడ్డారు. సత్వరమే కొత్తగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. అప్పటిదాకా తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు సంఘీభావంగా పాల్గొన్న ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెద్దన్నగౌడ్, జయరామప్ప మాట్లాడుతూ పీఆర్సీపై ఇచ్చిన చీకటి జీవోలన్నీ రద్దు చేయాలని డిమాండు చేశారు. ఐఏఎస్ల కమిటీ పూర్తిగా పక్కదారి పట్టిస్తోంది. తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నారన్నారు. ఫ్యాప్టో జిల్లా ముఖ్యనేతలు బి.నరసింహులు, సాకే పెద్దన్న, నాగేంద్ర, ఓబిలేసు, రమణారెడ్డి, సిరాజుద్దీన్, రవీంద్ర, గోపాల్రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను తుంగలో తొక్కిందన్నారు. మోసపూరిత వాగ్దానాలతో తమను నిండా ముంచే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని, అశుతోష్మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండు చేశారు.
తోపులాట.. ఉద్రిక్తత
ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడిన తర్వాత కలెక్టరేట్లోకి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కొందరు టీచర్లు బారీకేడ్లపైకి ఎక్కారు. మహిళలు సైతం బారికేడ్లను తోసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో చొచ్చుకురావడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పోలీసు రోప్ పార్టీలతో నిరసనకారులను బలవంతంగా వెనక్కినెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు.
బాసలు ఏమాయె సారూ..
పలువురు ఉపాధ్యాయులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కొందరు పాటల రూపంలో, మరికొందరు నినాదాలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జేవీవీ నాయకుడు, టీచరు శంకర్ శివరావు పాడిన పాట ఆకట్టుకుంది. ‘మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగారు.. ఉద్యోగాలకు ఇచ్చిన చేతి బాసలు ఏమాయే సారు’.. అంటూ సాగిన పాట అందరినీ ఆలోచింపజేసింది.
ప్లకార్డు ప్రదర్శిస్తూ..
జీవోలను రద్దు చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయినులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
[ 19-04-2024]
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!