మృతులకూ టీకా వేస్తున్నారట ..!
ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. టీకా వేయకుండానే వేసినట్లు చాలామంది చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. ఏడాది కిందట చనిపోయిన వారికి కూడా రెండు డోసులు టీకా వేసినట్లు వివరాలు నమోదు చేసి కుటుంబ
క్షేత్రస్థాయిలో సిబ్బంది అలసత్వం
వివరాల నమోదులో గందరగోళం
ఫిర్యాదులొచ్చినా పట్టింపేదీ?
టీకా వేస్తున్న సిబ్బంది
ఈనాడు డిజిటల్, అనంతపురం: ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. టీకా వేయకుండానే వేసినట్లు చాలామంది చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. ఏడాది కిందట చనిపోయిన వారికి కూడా రెండు డోసులు టీకా వేసినట్లు వివరాలు నమోదు చేసి కుటుంబ సభ్యుల ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు. గతేడాది టీకా కార్యక్రమం ప్రారంభమైన సమయంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో రెండో డోసు వేసుకోకుండానే వేసినట్లు నమోదైంది. సాంకేతిక లోపంతో పొరపాట్లు జరిగాయని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణమన్నది బహిరంగా రహస్యం.
ఆధార్ నెంబర్లు సేకరించి..
తప్పుడు సందేశాలు నిత్యం వందల్లో వెలుగుచూస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులు తమకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లోని వ్యక్తుల ఆధార్కార్డు, ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి టీకా వేయకుండానే సమాచారాన్ని యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. కొవిన్ యాప్లో టీకా వేసినట్లు నమోదు కావడంతో సంబంధిత వ్యక్తులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సమాచారం వెళ్తోంది. దీంతో టీకాలు వేసుకోని వారు ఇబ్బందులు పడుతున్నారు. టీకా వేసుకోవడానికి సమీపంలోని కేంద్రానికి వెళ్తే అప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సమాధానం చెబుతున్నారు. దీనిపై కొంతమంది వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సాంకేతిక లోపాలు ఉన్నాయని చెబుతున్నారు తప్ఫ. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.
లక్ష్యం చేరేందుకు...
జిల్లాలో వందశాతానికి మించి మొదటి డోసు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది టీకా వేసుకోలేదు. కొంతమందికి అవగాహనలేక, మరికొందరు భయపడి టీకాకు దూరంగా ఉన్నారు. మరోవైపు 85 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. లక్ష్యం చేరేందుకు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పరీక్షలపైనా ఉదాసీనత
రెండు దశల్లో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలామందికి లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడుతున్నారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 30 శాతం దాటింది. పెద్దసంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించి ఎక్కడికక్కడ వైరస్ సోకినవారిని ఆసుపత్రులు, హోంఐసోలేషన్ కేంద్రాల్లో చేర్పించాల్సి ఉంది. అయితే అధికారులు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అనంతలోని వైరాలజీ ల్యాబ్లో రోజుకు 6 వేల పరీక్షలు చేయవచ్ఛు ప్రస్తుతం రోజుకు 3,500కి మించి చేయడం లేదు. నియోజకవర్గ కేంద్రాల్లో కిట్ల కొరత వేధిస్తోంది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో రోజుకు సగటున 30కి మించి పరీక్షలు చేయడం లేదు. కేవలం లక్షణాలు ఉన్నవారి నమూనాలు మాత్రమే సేకరిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరయ్యేందుకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. అయితే లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయడం లేదు.
నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు
కొంతమందికి రెండో డోసు వేయకుండానే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తప్పుడు సందేశాలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. పోర్టల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఇలా జరుగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైనా సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా టీకాలు వేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - యుగంధర్, జిల్లా వ్యాధినిరోధక టీకాల నిర్వహణాధికారి
జిల్లాలో వ్యాక్సినేషన్ లెక్కలిలా..
మొదటిడోసు 32,77,873
రెండో డోసు 28,00,684
15-18 ఏళ్ల వారికి 2,03,943
ప్రీకాషన్ డోసు 17,330
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా