వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి
రాష్ట్రంలో వైకాపా అరాచకాలు, విధ్వంస పాలన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నగరంలో గురువారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ అధ్యక్షతన ముఖ్యనేతలు, కార్యకర్తల
మాట్లాడుతున్న సోము వీర్రాజు, పక్కన నాయకులు విష్ణువర్దన్రెడ్డి, చిరంజీవిరెడ్డి తదితరులు
అరవిందనగర్(అనంతపురం), న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా అరాచకాలు, విధ్వంస పాలన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నగరంలో గురువారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేశ్ అధ్యక్షతన ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దనరెడ్డి మాట్లాడుతూ.. వైకాపాకు 150 సీట్లు కట్టబెట్టి అధికారంలోకి తెచ్చినా ప్రజల మనోభీష్టాలను కాదని అధికార దర్పంతో సాగిస్తున్న పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని హెచ్చరించారు. సమావేశం అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పెండింగ్ ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నామస్మరణ మినహా.. ఈ ముఖ్యమంత్రికి మరో ధ్యాస ఏదీ లేదు. రాష్ట్రంలోని హంద్రీ-నీవా, గాలేరు నగరి పెండింగ్ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వానికి అక్కర లేదా?. వీటి గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని భాజపా ప్రశ్నిస్తోంది. రూ.65 వేల కోట్లతో జాతీయ రహదారులు, రైలు మార్గాల అభివృద్ధి.. కర్నూలు, తిరుపతి, విజయవాడల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేసింది. గనులను జాతీయం చేస్తోంది. వైకాపా ప్రభుత్వం మాత్రం బస్టాండ్లను తాకట్టుపెడుతోంది. మాట తప్పను.. మడమ తిప్పను అని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం సర్పంచులకు ఇస్తున్న నిధులు కూడా లాక్కుంటున్నారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలించకుండా వ్యాపారాలు చేస్తోంది. ఇసుకను అమ్ముకున్నారు. సిమెంటు ధర పెంచారు. భాజపా అధికారంలోకి వస్తే చౌకగా ఇసుక, రూ.200లకు సిమెంటు బస్తా విక్రయిస్తాం. సీమలో సస్య విప్లవం తెస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, లలిత్కుమార్, వెంకటేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, సూర్యప్రకాశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ