వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో తనిఖీలు
కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు నేపథ్యంలో అదనపు డైరెక్టరు వినయ్చంద్, సహాయ డైరెక్టరు మునీశ్వరప్రసాద్ నేతృత్వం
క్షేత్రాన్ని పరిశీలిస్తున్న కమిషనరేట్ అధికారులు
కణేకల్లు, న్యూస్టుడే: కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు నేపథ్యంలో అదనపు డైరెక్టరు వినయ్చంద్, సహాయ డైరెక్టరు మునీశ్వరప్రసాద్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత ఖరీఫ్లో విత్తన వరి దిగుబడి ఏ మేరకు వచ్చిందనే వివరాలను జేడీఏ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించిన సస్యరక్షణ ఏడీఏ విద్యావతి, భూసంరక్షణ ఏడీఏ మద్దిలేటిని అడిగి తెలుసుకొన్నారు. క్షేత్రాధికారి పదేళ్లుగా ఇక్కడే తిష్టవేసి విధులు నిర్వహించడం, వచ్చిన దిగుబడి వివరాల నమోదు వంటి రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, అందుకు సంబంధించి బిల్లులు లేకపోవడం గుర్తించారు. పదేళ్ల కాలంలో వచ్చిన దిగుబడి వివరాలు, ఏ జిల్లాకు ఎంత విత్తనం పంపారు, ఎంత సొమ్ము ప్రభుత్వ ఖజానాకు జమ చేశారనే వివరాలపై క్షేత్రాధికారి సనావుల్లాను ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, పొంతన లేని సమాధానం చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గోదాముల్లో నిల్వ చేసిన విత్తన వరి దిగుబడి, విత్తనోత్పత్తి క్షేత్రాన్ని పరిశీలించారు. క్షేత్రం చుట్టూ ఉన్న కంచె ఏమైందని క్షేత్రాధికారిని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నా కమిషనరేట్ అధికారులు తనిఖీలు చేపట్టి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు