విత్తనోత్పత్తి క్షేత్రంఅధికారి పెత్తనం !
కణేకల్లు వరి విత్తనోత్పత్తి కేంద్రం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం ఆ క్షేత్రంలోని అధికారికి కలిసొచ్చాయి. తనను అడిగేదెవరు అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, లెక్కలు లేకుండానే
ప్రభుత్వ సొమ్ము పక్కదారి
తనిఖీల్లో గుర్తించినా చర్యల్లేవు
విత్తనోత్పత్తి క్షేత్రంలో ధాన్యం కుప్పలు
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, కణేకల్లు: కణేకల్లు వరి విత్తనోత్పత్తి కేంద్రం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం ఆ క్షేత్రంలోని అధికారికి కలిసొచ్చాయి. తనను అడిగేదెవరు అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, లెక్కలు లేకుండానే దశాబ్దంపాటు క్షేత్రాన్ని నడిపించారు. వచ్చిన దిగుబడిని తక్కువ చేసి చూపిస్తూ భారీ అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఫలితంగా పదేళ్లలో సుమారు రూ.10 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆడిట్ జరగ్గా.. పెట్టుబడి వ్యయం, దిగుబడి వివరాలు, వచ్చిన ఆదాయాన్ని చూపే బిల్లులు, రికార్డులు లేకపోవడంతో అవినీతి జరిగినట్లు తేలింది. అయినా సదరు అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నివేదికను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు తనిఖీలకు వచ్చిన కమిషనరేట్ అధికారులు కూడా సుమారు రూ.5 కోట్ల వరకు అవినీతి జరిగిందనే నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
లెక్కలు లేవప్ఫా.
సాధారణ రైతు వరి సాగు చేసినా హెక్టారుకు (2.5 ఎకరాలు) 75 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విత్తనోత్పత్తి కేంద్రంలో మాత్రం 40-45 క్వింటాళ్లకు మించడం లేదు. అంటే హెక్టారుకు 30 క్వింటాళ్లు తక్కువ చేసి చూపుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రంలోని అధికారిపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది ఉన్నతాధికారులు పర్యవేక్షించగా.. 53.98 క్వింటాళ్ల దిగుబడి రావడం గమనార్హం. గతంతో పోలిస్తే హెక్టారుకు 13 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. ఈలెక్కన 56 (140 ఎకరాలు) హెక్టార్లకు సగటున 3,024 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు రాయితీ పోగా రెండు పంటలకు గాను ఏడాదికి రూ.కోటిపైనే ఆదాయం వస్తుంది. ఈ లెక్కన హెక్టారుకు 53.98 క్వింటాళ్ల ప్రకారమే. సగటు దిగుబడి 75 క్వింటాళ్లుగా పరిగణనలోకి తీసుకుంటే ఆదాయం రూ.కోటిన్నర వరకు ఉంటుందని అంచనా. జేడీఏ ఆధ్వర్యంలో ఈఏడాది వరిగడ్డి వేలం వేయగా రూ.2.57 లక్షల ఆదాయం వచ్చింది. పదేళ్లలో గడ్డి వేలానికి సంబంధించిన రికార్డులు లేవని చెబుతున్నారు. ప్రాసెసింగ్ చేయగా మిగిలిన నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యాన్ని వేలం వేసిన దాఖలాలు లేవు. అంటే ఆ మొత్తం పక్కదారి పట్టినట్లు అర్థం అవుతోంది. మరోవైపు విత్తన వరిని ఎన్ని జిల్లాలకు ఎంతమేర పంపారు? దాన్ని విక్రయించగా.. వచ్చిన సొమ్ములో ప్రభుత్వానికి ఎంత చెల్లించారు? అనే రికార్డులు చూపించడం లేదని తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారులే చెబుతున్నారు.
విచారణ చేపడుతున్నాం - చంద్రనాయక్, జేడీఏ
వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈసారి దిగుబడులపై నిఘా పెట్టి పక్కాగా నమోదు చేయించాం. వరిగడ్డి ద్వారా ప్రభుత్వానికి రూ.2.57 లక్షల ఆదాయం వచ్చింది. సంబంధిత రికార్డులను అడిగితే సమాధానం దాటవేస్తున్నారు. అందుకే క్షేత్రంలో ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. దీనిలో భాగంగానే కమిషనరేట్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. అక్రమాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
ఇదీ ఉద్దేశం
హెచ్చెల్సీ ఏర్పాటుతో సాగునీటికి ఢోకా ఉండదనే ఉద్దేశంతో కణేకల్లులో 1966లో వరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 192 ఎకరాల భూమిని కేటాయించగా.. రెండు క్షేత్రాల పరిధిలోని 140 ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. మిగిలిన భూమిని ఖాళీగా ఉంచారు. ఇక్కడ బీపీటీ సోనా 5204 రకం వరి విత్తనోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం హెక్టారుకు రూ.60 వేలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. వచ్చిన దిగుబడిని ప్రాసెసింగ్ చేసి 30 కిలోల బస్తాల్లో ప్యాకింగ్ చేసి రాష్ట్రంలోని 13 జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. క్వింటా ధర రూ.3,950గా నిర్ణయించారు. రాయితీపోగా రైతులు క్వింటాకు రూ.2,210 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా విత్తన వరిని విక్రయించగా వచ్చిన సొమ్మును సంబంధిత ఏవోలు క్షేత్రం ఖాతాలో జమ చేస్తారు. దీంతోపాటు వరిగడ్డి, ప్రాసెసింగ్ చేయగా మిగిలిన నాణ్యత తక్కువ ఉన్న ధాన్యాన్ని వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి.
పదేళ్లుగా తిష్ట
2011లో విత్తనోత్పత్తి క్షేత్రం బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి ఇంకా అక్కడే కొనసాగుతుండటం విశేషం. గతంలో కళ్యాణదుర్గం, మరోసారి జిల్లా కేంద్రం సమీపంలోని రైతు శిక్షణ కేంద్రానికి బదిలీ అయినా డిప్యుటేషన్పై ఇక్కడికే వచ్చి చేరడం గమనార్హం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిబంధనలను గాలికొదిలేసి క్షేత్రాన్ని తన సొంత పొలంలా మార్చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రంలో కొంతభాగాన్ని కణేకల్లుకు చెందిన పలువురు రైతులకు కౌలుకు ఇచ్చి రూ.లక్షల్లో దండుకున్నట్లు సమాచారం. విత్తనోత్పత్తి క్షేత్రం మినహాయించి మిగిలిన ఖాళీ భూముల్ని కూడా అనధికారికంగా సాగు చేసి వచ్చిన ఆదాయాన్ని జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చే రివాల్వింగ్ ఫండ్కు కనీసం ప్రతిపాదనలు కూడా పంపడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు వచ్చిన దిగుబడిని కూడా తక్కువ చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు తనిఖీలకు వచ్చిన అధికారులు గుర్తించినట్లు సమాచారం.
కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్ర కార్యాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!