భయపెట్టి... బకాయిలు రాబట్టి!
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన మొత్తం 487మంది లబ్ధిదారులకు తాఖీదులు ఇచ్చారు. బకాయి చెల్లించకుండా జాప్యం చేస్తున్నవారిపై అధికారులు దృష్టి సారించారు. రుణం పొందే సమయంలో హామీ సంతకం చేసిన ఉద్యోగులను సైతం వదలడం లేదు. జిల్లాలో ఇప్పటికే 200 మంది
200మంది ప్రభుత్వ ఉద్యోగులకు తాఖీదులు
ఎస్సీ రుణాల వసూలుకు వ్యూహం
జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంఘం కార్యాలయం
న్యూస్టుడే-అనంత సంక్షేమం : ‘జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన మొత్తం 487మంది లబ్ధిదారులకు తాఖీదులు ఇచ్చారు. బకాయి చెల్లించకుండా జాప్యం చేస్తున్నవారిపై అధికారులు దృష్టి సారించారు. రుణం పొందే సమయంలో హామీ సంతకం చేసిన ఉద్యోగులను సైతం వదలడం లేదు. జిల్లాలో ఇప్పటికే 200 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు. నేరుగా వారి జీతాల నుంచి వసూలు అయ్యేలా చర్యలు చేపట్టారు. ఎప్పుడో తీసుకున్న రుణానికి అప్పట్లో హామీ ఇచ్చిన వారికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి’.
పాత బకాయిల వసూలుపై జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంఘం (ఎస్సీ కార్పొరేషన్) దృష్టి సారించింది. లబ్ధిదారులతో పాటు ఎవరైతే పూచీ(గ్యారెంటీ) ఇచ్చి ఉంటారో వారికి సైతం తాఖీదులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇన్నోవా, ట్రాక్టర్లు, ఆటోలు, నాన్ ట్రాన్స్పోర్టు విభాగాల కింద రుణాలు ఇచ్చారు. ఇందులో 104మంది ఒక్క పైసా కూడా చెల్లించలేదు. 69మంది అడపాదడపా కడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది బృందాలుగా విడిపోయి వసూళ్లే ధ్యేయంగా లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా నిధులు అందించారు. రాష్ట్రస్థాయిలో వసూళ్లు చేయాలని నిర్దేశించడంతో అనంత అధికారులు సైతం వసూళ్లకు తెరతీశారు.
రెండేళ్లుగా రుణం ఊసే లేదు
జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ కింద పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. రెండేళ్లుగా కరోనా రావడంతో ఇబ్బంది ఏర్పడిందని, ఉన్న పళంగా పాత బకాయి చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. 2015 నుంచి 2018 సంవత్సరం వరకు రుణాలు ఇచ్చారు. తాఖీదులు ఇవ్వడం, ఉద్యోగుల జీతాల నుంచి వసూలు చేస్తుండటంతో ఏకంగా ఇప్పటికే రూ.కోటి వసూలు అయింది. రెండున్నరేళ్లుగా పథకాన్ని ఆపేశారు. ఇటీవలే కేవలం 8 ఇన్నోవా కార్లు ఇస్తామని లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే ఇంటర్వ్యూలు నిర్వహించలేదు.
హామీ దారులే బాధ్యులు - డాక్టర్ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
కార్పొరేషన్ ఇచ్చిన రుణం కొందరు సక్రమంగా చెల్లిస్తున్నారు. మరికొందరు చెల్లించకపోవడంతో కలెక్టరు ఆదేశాల మేరకు తాఖీదులు ఇవ్వడంతో చెల్లిస్తున్నారు. బకాయి చెల్లించని వారికి హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తున్నాం. ఇప్పటి దాకా ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా రూ.కోటికి పైగానే వసూలు అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా