కరోనాపంజా
జిల్లాలో కరోనా ఉద్ధృతమవుతోంది. శుక్రవారం కొత్తగా 1,235 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 4,254కు చేరాయి. పాజిటివ్ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,903 మందికి పరీక్షలు చేయగా.. 1,235 మందికి పాజిటివ్గా
కొత్తగా 1,235 కేసులు
పాజిటివిటీ 25.19 శాతం
గురుకుల పాఠశాలలో కలకలం
పెనుకొండ పట్టణం: పెనుకొండలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులకు కొవిడ్ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ రఘునందన్నాయక్ బాధిత తల్లిదండ్రులను పిలిపించి వారి వెంట విద్యార్థినులను ఇంటికి పంపించారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన వారిలో 23 మంది తీవ్రమైన జ్వరం ఉండటంతో రెండు రోజుల క్రితం కొవిడ్ పరీక్షలు చేశారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం పాఠశాలలో 60 మంది ఉన్నారు. శుక్రవారం 20 మందికి కొవిడ్ పరీక్ష చేశారు.
ఎక్కడెక్కడ ఎన్నెన్ని..
అన్ని పట్టణ, మండల కేంద్రాలకు వైరస్ వ్యాప్తి చెందింది. తాజాగా కేసులను పరిశీలిస్తే.. అనంత నగరంలో 361, హిందూపురం 119, కదిరి 69, పుట్టపర్తి 63, పెనుకొండ 57, గుంతకల్లు 38, అనంత గ్రామీణం 37, తాడిపత్రి 35, పెద్దవడుగూరు 30, సోమందేపల్లి 30, కళ్యాణదుర్గం 28, ధర్మవరం 27, గోరంట్ల 26, లేపాక్షి 21, ముదిగుబ్బ 20, యాడికి 16, బుక్కరాయసముద్రం 15, గుత్తి 15, కొత్తచెరువు 15, చిలమత్తూరు 14, గుడిబండ 13, బత్తలపల్లి 11, కంబదూరు మండలంలో 11 చొప్పున నమోదయ్యాయి.
సర్వజనలో కలవరం
సర్వజనాసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. సుమారు 15 మంది వైద్యులు ఇప్పటికే హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇద్దరు అధికారులు, నర్సింగ్ పర్యవేక్షకురాలు క్వారంటైన్లో ఉన్నారు. గర్భిణులు, బాలింతల వార్డులో 24 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈక్రమంలో సాధారణ రోగుల ఓపీ సేవలను తగ్గించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. సర్వజనాసుపత్రిలోని కొవిడ్ ఓపీ విభాగంలో అనుమానిత లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయనున్నారు. బాధితుల మొదటి, రెండో కాంట్రాక్టులు, ఇతరులు పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ కేంద్రాల్లో నమూనాలు ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఏడుగురు ఉపాధ్యాయులకు..
తనకల్లు: మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. చండ్రాయునిపల్లి, పరమటవారిపల్లి, రాసినేపల్లి, లక్ష్మేనాయక్తండా, మార్పూరివాండ్లపల్లి, కొక్కంటి దళితవాడ, వేపలపల్లి పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ క్యారంటైన్లో ఉన్నారు. ఆయా పాఠశాలల్లో శానిటైజ్ చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM