logo

విద్యుదాఘాతంతో టింబర్‌ డిపో దగ్ధం

పట్టణంలోని పార్థసారథినగర్‌లో బాబాఫక్రుద్దీన్‌కు చెందిన టింబర్‌ డిపోలో శుక్రవారం విద్యుదాఘాతంతో కలప దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమీపంలో నివాసాలు

Published : 22 Jan 2022 04:25 IST


మంటలు ఆర్పుతున్న సిబ్బంది

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని పార్థసారథినగర్‌లో బాబాఫక్రుద్దీన్‌కు చెందిన టింబర్‌ డిపోలో శుక్రవారం విద్యుదాఘాతంతో కలప దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రేగడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమీపంలో నివాసాలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక అధికారి రాజు, సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిపోలోని కలప కాలిపోయింది. రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత టింబర్‌ డిపో యజమాని బాబాఫక్రుద్దీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని