బడికెళ్లేదెలా సారూ...!
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పడగ విప్పింది. 88 మంది ఉపాధ్యాయులు, సుమారు 30 మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ఇది అధికారికంగానే.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. విద్యార్థుల్లో 30 శాతంపైగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి
పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా
పాఠశాలల్లో నిబంధనలు గాలికి..
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పడగ విప్పింది. 88 మంది ఉపాధ్యాయులు, సుమారు 30 మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ఇది అధికారికంగానే.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. విద్యార్థుల్లో 30 శాతంపైగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు. బాధితులు ఉన్న పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు.
కస్తూరిబా విద్యాలయాల్లోనూ అదే పరిస్థితి. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులను వైరస్ చుట్టుముట్టింది. వసతి గృహాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాలున్నాయి. వీటితోపాటు సంక్షేమ వసతి గృహాల్లోనూ అందరూ కలసి ఉండటంతో కరోనా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. వసతి గృహ విద్యార్థుల్లో 40 శాతం మందికి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్టుడే, అనంతపురం విద్య కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మూడో అల ఉద్ధృతంగా ఉంటుందని సంకేతాలు వస్తున్నా సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. పాఠశాలల్లో మరీ దారుణం. కొవిడ్ నిబంధనలు అమలు చేయడం లేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాస్కులు అరకొరగానే ధరిస్తున్నారు. పాఠశాలలోకి ప్రవేశించే సమయంలో శరీర ఉష్ణోగ్రత పరిశీలించేవారే లేరు. శానిటైజర్ ఊసేలేదు. శుభ్రత అంతంత మాత్రమే. ఎక్కడా భౌతికదూరం కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు భయంభయంగానే పిల్లలను పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 88 మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. పలువురు విద్యార్థులకు వైరస్ సోకింది. ఇవి ప్రభుత్వ వైద్యకేంద్రాల్లో చేసిన పరీక్షా ఫలితాలే. అనేకమంది ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పరీక్షలు చేయించుకుంటున్నారు. కొందరు ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారు. ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుంపులుగా చేరొద్దు
సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభంలో మొదటి రెండు రోజులు విద్యార్థులు 50 శాతం మాత్రమే హాజరయ్యారు. మూడు రోజులుగా 70 శాతం హాజరు నమోదవుతోంది. అయితే అనేకమంది జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అయినా పాఠశాలకు వస్తుండటంతో తోటి విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వందల మంది విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయినా భౌతిక దూరం పాటించడం లేదు. చాలామంది మాస్కులు ధరించడం లేదు. మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా చేరుతున్నారు.
నిబంధనలు అమలు చేస్తాం: శామ్యూల్, డీఈఓ
కొవిడ్ నిబంధనలు పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఉపాధ్యాయులందరికీ టీకాలు 100 శాతం వేయించాం. 15 ఏళ్లు నిండిన విద్యార్థులకు మొదటి డోసు పూర్తి చేశాం. కరోనా నిర్ధారణ అయిన తరగతి విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని ఆదేశించార. పాఠశాలల్లో శానిటైజ్ చేయిస్తున్నాం. కొవిడ్ పరీక్షలు పాఠశాలల్లో నిర్వహించే విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
కస్తూరిబాలో కరోనా కలకలం
ఉరవకొండ: పట్టణంలోని కస్తూరిబా విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. మొత్తం 20 మంది వైరస్ బారినపడ్డారు. మూడురోజుల కిందట ఓ విద్యార్థిని కొవిడ్బారిన పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల కిందట 38 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు శనివారం వచ్చాయి. 19 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో విద్యాలయం ఎస్వోతో కలిపి 9 మంది ఉపాధ్యాయినులు, 11 మంది విద్యార్థినులు ఉన్నారు. ఉన్నతాధికారులు విద్యాలయానికి మూడురోజులు సెలవులు ప్రకటించారు. విద్యార్థినులందరినీ ఇళ్లకు పంపించేశారు.
తల్లిదండ్రులూ జాగ్రత్త
విద్యార్థుల ఆరోగ్యాన్ని అధికారులు, పాఠశాల యాజమాన్యంపైనే వదిలేయకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. తమ పిల్లలు మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలి. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం నేర్పాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం చేయించాలి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గేవరకు బడికి పంపవద్ధు
విశ్వవిద్యాలయాల్లో..
ఎస్కేయూ, న్యూస్టుడే: జేఎన్టీయూ, ఎస్కేయూలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్కు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, బోధన సిబ్బంది సుమారు 50 మంది కొవిడ్ బారినపడ్డారు. జేఎన్టీయూ వసతి గృహంలో 20 మంది విద్యార్థినులు కరోనాతో బాధపడుతున్నారు. అయినా వారికి ప్రత్యేకంగా గదులు కేటాయించలేదు. ఇతర విద్యార్థినులతో కలిసి ఉండటంతో భయాందోళన నెలకొంది. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వారు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు కూడా సరఫరా చేయడం లేదు. కొందరు విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
మాస్కులు ధరించని విద్యార్థినులు
అందరికీ పరీక్షలు చేస్తేనే..
15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు టీకాలు పాఠశాలలోనే వేయిస్తున్నారు. అలాగే ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షలు చేయించాలి. అనుమానం ఉన్న ప్రతిఒక్కరికీ పరీక్షలు విధిగా చేయిస్తే మంచిది. ఫలితాలు వెలువడిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలి. ఇలా చేస్తేనే కరోనా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అన్ని పాఠశాలలను శానిటైజ్ చేయాలి
ప్రభుత్వ పాఠశాలలు: 3,841
ఉపాధ్యాయులు: 25,894
విద్యార్థులు: 3.61 లక్షలు
వైరస్ సోకిన ఉపాధ్యాయులు: 88
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.