ఒక్క పునాదీ తీయలేదు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం మండలంలో అమలుపై సందిగ్ధం నెలకొంది. అనువుగానిచోట స్థలాలు కేటాయించడమే అందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మండలవ్యాప్తంగా ఇంటి స్థలాలకోసం రెండేళ్ల కిందట పేదలు 10,318 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అనువుగానిచోట స్థలాల కేటాయింప
కొలిమిపాళ్యం సమీపంలో కేటాయించిన స్థలం
కుందుర్పి, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణం మండలంలో అమలుపై సందిగ్ధం నెలకొంది. అనువుగానిచోట స్థలాలు కేటాయించడమే అందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మండలవ్యాప్తంగా ఇంటి స్థలాలకోసం రెండేళ్ల కిందట పేదలు 10,318 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు నిబంధనల పేరిట, రాజకీయ ఒత్తిళ్లతో 263 మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు లెక్కతేల్చి అందుకు అనుగుణంగా స్థలాలు అందించే కార్యక్రమం చేపట్టారు. 13 గ్రామ పంచాయతీలకు గాను ఆరింటిలో లబ్ధిదారులకు నిరుపయోగంగా ఉన్న కొండలను కేటాయించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుట్టలను చదునుచేసి లేఅవుట్లు వేసి రెండేళ్లు పూర్తయినా ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదు. కనీసం పునాది కూడా తీయలేదు.
జంబుగుంపల పంచాయతీ పరిధిలో మూడు గ్రామాలకు స్థలాలను కి.మీ.ల దూరంగా కర్ణాటక సరిహద్దును ఆనుకొని ఉన్న కొండలో ఇచ్చారు. ఎత్తుపల్లాలను సరిచేసి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు పంచాయతీ కేంద్రానికి, ఇటు నివాసగ్రామానికి దూరంగా ఉండటంతో నిర్మాణం ఎలా చేపట్టాలని, అక్కడ నివాసం ఉండటమెలా అని ఆందోళన చెందుతున్నారు. కొలిమిపాళ్యంలోనూ అదే పరిస్థితి.
మండలకేంద్రంలోనూ ఊరికి దూరంగా పెద్దకొండను ఆనుకొని బూడిదనేలను చదునుచేసి, పైనమాత్రం అడుగు మేర ఎర్రమట్టిని వేసి రోలింగ్చేశారు. పునాదులకు అనుకూలంగా లేదని లబ్ధిదారులు అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కొండపైన ఉన్న కోటగోడలు జారిపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెనగల్లులో గ్రామానికి దూరంగా కి.మీ. పరిధిలో కొండకు ఆనుకొని స్థలాలు కేటాయించారు. పనులు చేపట్టకపోవటంతో పిచ్చిమొక్కలు, కంపచెట్లు మొలిచి కేటాయించిన సంబర్లు కూడా కనిపించనంతగా మారిపోయాయి.
అపిలేపల్లి పంచాయతీ పరిధిలో రెండు గ్రామాలకు కలిపి మందలపల్లి సమీపాన కొండగుట్టలో రాళ్లను తొలగించి లేఅవుట్ వేశారు. వర్షాకాలంలో ఇక్కట్లు తప్పవని, కొండపైనుంచి నీళ్లొచ్చే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆసక్తి చూపటంలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
మండలంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కొండప్రాంతాల్లోనే చదునుచేసి పట్టాలు ఇచ్చినట్లు తహసీల్దారు ఈశ్వరమ్మ పేర్కొన్నారు. గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో త్వరలో రెండో విడత నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్