భూమి డబ్బులు అడిగితే.. బెదిరిస్తున్నారు
తనతండ్రి నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికార వైకాపా నాయకులు కాళ్లు నరుకుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితుడు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం కదిరి మండలంలో చోటు చేసుకుంది
అవమానంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
ప్రభుత్వ ఆసుపత్రిలో రోదిస్తున్న రంజిత్నాయక్
కదిరి పట్టణం, న్యూస్టుడే: తనతండ్రి నుంచి కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని అడిగితే అధికార వైకాపా నాయకులు కాళ్లు నరుకుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితుడు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన బుధవారం కదిరి మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు. కదిరి మండలం అలీపూర్తండాకు చెందిన రమణానాయక్ సంవత్సరం కిందట ముత్యాలచెరువు గ్రామ పొలంలోని 86 సెంట్ల భూమిని వైకాపా నాయకులు కృష్ణానాయక్, ఉపేంద్రనాయక్, సేవేనాయక్లకు రూ.66 లక్షలకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో రూ.2.37 లక్షలు చెల్లించి మిగతా సొమ్ము త్వరలోనే ఇస్తామని చెప్పారు. కృష్ణానాయక్ భార్య జడ్పీటీసీ ఎన్నికలబరిలో ఉన్నందున కౌంటింగ్ పూర్తయ్యాక మొత్తం డబ్బు చెల్లిస్తామన్నారు. బంధువులే కావడంతో రమణనాయక్, అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. కౌంటింగ్ పూర్తయి నెలలు గడుస్తున్నా... వాయిదా వేస్తుండటంతో రమణానాయక్ కుటుంబం డబ్బుకోసం ఒత్తిడి పెంచారు. ఈలోపే అనారోగ్యం పాలైన రమణానాయక్ నెలరోజుల కిందట మరణించారు. భూమి డబ్బులు ఇవ్వని కారణంగానే తమతండ్రి మనోవేదనకు గురై మరణించాడని రంజిత్నాయక్ భూమిని కొనుగోలు చేసిన కృష్ణానాయక్, ఉపేంద్రనాయక్, సేవేనాయక్ల దృష్టికి తీసుకెళ్లారు. వారు మరోసారి వాయిదా కోరారు. అందుకు రంజిత్ నాయక్, ఆయన కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో వైకాపా నాయకులు బెదిరింపులకు దిగారు. తమకు రావాల్సిన డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేని రంజిత్నాయక్ మనస్తాపానికి గురై పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కదిరి గ్రామీణ సీఐ మహమ్మద్ రియాజ్ అహమ్మద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు