అనంత లోకాలకు.. అక్షర యోధుడు!
ఆయన కవిత్వం ఆలోచనాత్మకం.. ఆయన అవధానం సాహితీలోకానికి వీనులవిందు. పద్యం చెబితే తెలుగుభాషలోని తీయదనం రుచిచూస్తాం. అందుకే ‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యమిథ్యను కాపాడువాడు.. పద్యధ్వేషనలతో రాపాడువాడు’ ఆశావాది
అవధాని ఆశావాది ప్రకాశరావు ఇకలేరు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారం
అందుకుంటున్న ప్రకాశరావు (పాతచిత్రం)
అనంతపురం విద్య, పెనుకొండ, న్యూస్టుడే: ఆయన కవిత్వం ఆలోచనాత్మకం.. ఆయన అవధానం సాహితీలోకానికి వీనులవిందు. పద్యం చెబితే తెలుగుభాషలోని తీయదనం రుచిచూస్తాం. అందుకే ‘పద్యం కమ్మగా పాడువాడు.. పద్యమిథ్యను కాపాడువాడు.. పద్యధ్వేషనలతో రాపాడువాడు’ ఆశావాది ప్రకాశరావు అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆయనను కీర్తించారు. సాహిత్య పిపాసులు ఆయనకు గండపెండేరం తొడిగారు. కనకాభిషేకం చేశారు. ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సాహితీ శ్రామికుడు ఆశావాది ప్రకాశరావు(77) ఇక లేరు. గురువారం మధ్యాహ్నం పెనుకొండలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.
ఇదీ ప్రస్థానం..
శింగనమల మండలం పెరవలి గ్రామంలో ఫక్కీరప్ప, కుళ్లాయమ్మ దంపతులకు 1944 ఆగస్టు 2న జన్మించారు. ప్రాథమిక విద్య పెరవలి, 6 నుంచి డిగ్రీ వరకు అనంతపురంలో చదివారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పీజీ సెంటర్గా ఉన్నప్పుడు ఎంఏ పూర్తిచేశారు. తెలుగు పండితుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా ఉద్యోగ విరమణ చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. హైదరాబాద్ క్షీరసాహితీ సమితి వారు కనకాభిషేకం చేశారు. పెనుకొండలో గండపెండేరం తొడిగారు. ఉగాది పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి హంస పురస్కారం, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. సుమారు 150కిపైగా రచనలు ఆయన కలం మీదుగా జాలువారాయి.
ఆసాది నుంచి ఆశావాదిగా..
ప్రకాశరావు ఇంటి పేరు ఆసాది. ఆయన అనంతలోని సాయిబాబా కళాశాలలో చదివే రోజుల్లో స్నేహితుల నుంచి ప్రశ్నలు వేయించుకుని వాటికి అవధానం రూపంలో సమాధానం చెప్పేవారు. అప్పటి తెలుగు విభాగం అధ్యక్షుడిగా ఉన్న నండూరి రామకృష్ణమాచార్యులకు తెలిసి ప్రకాశరావును పిలిపించారు. ‘ఏదో అవధానం చేశావట కదా! నేనే సమస్య ఇస్తాను పూరించు’ అన్నారు. దాన్ని పూర్తి చేసిన విధానానికి నండూరి సంబరపడిపోయారు. అవధానంతో నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఇప్పట్నుంచి నువ్వు ఆసాది కాదు.. ఆశావాది అని ప్రకాశరావు ఇంటి పేరును మార్చారు.
నివాళి అర్పిస్తున్న కుటుంబ సభ్యులు
పద్యంపై బాల్యం నుంచే మక్కువ
తొలి దళిత అవధానిగా ప్రసిద్ధికెక్కిన ప్రకాశరావుకు బాల్యం నుంచే పద్యంపై మక్కువ పెంచుకున్నారు. తన గురువైన జోగప్పపై విశ్వభూషణ అనే పుస్తకం రాశారు. శతావధాని సి.వి.సుబ్బన్న చేతుల మీదుగా కడప జిల్లా ప్రొద్దుటూరులోని అగస్తేశ్వరాలయంలో అవధానిగా ప్రకటించి మహాపండితుల మధ్య పరీక్షించారు. అందులో విజయం సాధించి సుబ్బన్నకు శిష్యుడిగా మారిపోయారు.
*ప్రకాశరావు అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పెనుకొండలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సాహితీ లోకానికి తీరనిలోటు
అనంత సాంస్కృతికం: అక్షరయోధుడు, అష్టావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు మరణం సాహితీలోకానికి తీరనిలోటని సాహితీవేత్తలు పేర్కొన్నారు. పల్లె నుంచి దిల్లీ దాకా తన సాహిత్యాన్ని వినిపించారని, ఆఖరిశ్వాస వరకూ అక్షర సేవకుడిగా పనిచేశారని కొనియాడారు. ఆయన మృతికి అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు రాచపాళం చంద్రశేఖరరెడ్డి, కవులు, రచయితలు శాంతినారాయణ, ఏలూరి యంగన్న, గుత్తా హరి, రమేష్నారాయణ, కొత్తపల్లి సురేష్, జెన్నే ఆనంద్కుమార్, నారాయణస్వామి, వన్నప్ప, విద్యావతి, త్యాగరాజ సంగీతసభ సభ్యులు షేక్ నబిరసూల్, వేమన అభ్యుదయ, అభివృద్ధి కేంద్రం సభ్యుడు అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సాహితీ స్రవంతి, జిల్లా రచయితల సంఘం, తెలుగువెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీరెడ్డి, మహాబోధి సాహిత్యవేదిక సభ్యుడు దాసన్నగారి కృష్ణమూర్తి, మాదిగ హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, సబ్కలెక్టరు నవీన్, పలువురు సాహితీవేత్తలు, సాహితీ సంస్థల నిర్వాహకులు సంతాపం తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?