logo

బాట.. బురద మేట

పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి గ్రామం నుంచి ఎల్లుట్లకు వెళ్లే రహదారి వర్షానికి బురదతో నిండి చిత్తడిగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పుట్లూరు నుంచి నార్పల వరకు

Published : 20 May 2022 03:23 IST

పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి గ్రామం నుంచి ఎల్లుట్లకు వెళ్లే రహదారి వర్షానికి బురదతో నిండి చిత్తడిగా మారింది. ఈ మార్గంలో రాకపోకలకు ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పుట్లూరు నుంచి నార్పల వరకు ఏడాది కిందట తారురోడ్డు నిర్మాణం జరిగినా అక్కడకక్కడ అసంపూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా మడ్డిపల్లి నుంచి ఎల్లుట్లకు వెళ్లే దారిలో నాలుగు చోట్ల రోడ్డు వేయకపోవడంతో బురద నిండిపోయింది. ద్విచక్ర వాహనదారులు గట్టుపై వెళుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు సత్వరమే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, మడ్డిపల్లి(పుట్లూరు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని