బస్సుకిందపడి యువకుడి దుర్మరణం
ఉన్నత చదువు చదివిన తమ ఒక్కగానొక్క కుమారుడు.. ఉద్యోగం చేసి ఇంటిని పోషిస్తానంటూ ఎప్పుడూ తల్లిదండ్రులతో చెబుతూ ఉద్యోగాన్వేషణలో ఉంటూ.. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి దుర్మరణం చెందాడు.
ముగ్గురికి తీవ్రగాయాలు
అబ్రార్ (పాతచిత్రం)
లేపాక్షి, న్యూస్టుడే: ఉన్నత చదువు చదివిన తమ ఒక్కగానొక్క కుమారుడు.. ఉద్యోగం చేసి ఇంటిని పోషిస్తానంటూ ఎప్పుడూ తల్లిదండ్రులతో చెబుతూ ఉద్యోగాన్వేషణలో ఉంటూ.. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మండల కేంద్రం లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీకి చెందిన టిప్పు కుమారుడు అబ్రార్(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గురువారం తోటి మిత్రులు అయాజ్, యూనస్లతో కలిసి ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. వీరు పోలీస్స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై వెళ్తుండగా.. చిలమత్తూరు మండలం పాతచామలపల్లికి చెందిన రాజారెడ్డి అక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుని అటువైపుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సును గమనించకుండా ప్రధాన రహదారిపైకి వచ్చాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ రాజారెడ్డి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న అబ్రార్ ద్విచక్ర వాహనాన్ని ముందు చక్రాల వద్ద ఢీకొనగా, రాజారెడ్డి ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు ఢీ కొన్నాడు. ప్రమాదంలో అబ్రార్ బస్సు ముందు చక్రాల కింద చిక్కి నుజ్జునుజ్జవగా, అయాజ్, యూనస్లకు తీవ్ర గాయాలయ్యాయి. రాజారెడ్డికి రెండు కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజారెడ్డికి మెరుగైన చికిత్సకు బెంగళూరుకు తరలించారు. బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు