Andhra News: సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా: చంద్రబాబు
మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు.
అనంతపురం: మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘‘అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలో ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా. తెదేపా హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి కల్పించాం. వైకాపా పాలనలో పరిశ్రమల్లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు. వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు’’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా