logo

పర్యాటకంగా అభివృద్ధి చేయాలని వినతి

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని భాజపా నాయకులు కోరారు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి వి

Published : 22 May 2022 04:33 IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న భాజపా నాయకులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని భాజపా నాయకులు కోరారు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పార్థసారథి, జిల్లా కార్యదర్శి జ్యోతిప్రసాద్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. సత్యసాయి నడియాడిన చిత్రావతినది పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఏపీలో అతిపెద్ద రెండో చెరువు బుక్కపట్నంలో బోటింగ్‌ సౌకర్యంతో పాటు, చెరువు మధ్య భాగంలో సత్యసాయి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. లేపాక్షికి యునెస్కో శాశ్వత గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని