పంట పండినా ..రైతన్నకు కన్నీరే !
ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ప్రక్రియ మొదలుకాలేదు. రెండురోజుల కిందట కణేకల్లులో ఓ కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టలేదు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటామని చె
వరి ధాన్యం అమ్ముకోలేక అవస్థలు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యం
కల్లంలో ధాన్యం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, బొమ్మనహాళ్: ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ప్రక్రియ మొదలుకాలేదు. రెండురోజుల కిందట కణేకల్లులో ఓ కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టలేదు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొంటామని చెబుతున్నా ఆచరణలోకి రాలేదు. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో ధాన్యం తడిసిపోతోంది. రైతు దీనస్థితి ఆసరాగా తీసుకుని వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. పంటను అమ్ముకోలేక.. కల్లాల్లో ఉంచుకోలేక రైతన్న అవస్థలు పడుతున్నారు.
కొనేది ఒక శాతమే
జిల్లాలో హెచ్చెల్సీ కింద కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల పరిధిలో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. గార్లదిన్నె, శింగనమల, పామిడి మండలాలతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చెరువుల కింద వరి పండిస్తున్నారు. 80 వేల ఎకరాలపైనే సాగవుతోంది. ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొత్తం 2 లక్షల టన్నుల ధాన్యం పండుతోంది. ప్రభుత్వం రెండు జిల్లాలో కలిపి 2,500 టన్నులు మాత్రమే కొనడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క శాతం మాత్రమే కొంటున్నారు. అందులోనూ జాప్యం చేస్తున్నారు. ఖరీఫ్లోనూ అధిక దిగుబడి రాగా.. 5 వేల టన్నులే కొనుగోలు చేసి చేతులు దులుపుకొన్నారు.
పెట్టుబడి భారమై..
పెరిగిన ఇంధన, ఎరువుల ధరలతో వరి సాగు భారంగా మారింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీల వేతనాలు, సేద్యం ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరా సాగుకు రూ.35 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. క్వింటా రూ.1500 ప్రకారం అమ్మితే రూ.37 వేలు వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు చేస్తే రూ.49 వేల వరకు అందుతుంది. వ్యాపారులకు విక్రయిస్తే ఎకరాకు రూ.12 వేలు నష్టపోవాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో క్వింటా వరికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండు చేస్తున్నారు.
మద్దతు ధర పెంచాలి - వెంకటరెడ్డి, వరి రైతు
పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా ప్రభుత్వం అన్నదాతలకు మద్దతు ధర క్వింటాకు రూ.2200కు పెంచాలి. వరి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లోని ధరలతో రైతులకు పెట్టుబడి కూడా దక్కదు. ఏటా అప్పులే మిగులుతున్నాయి.
గోనె సంచులు ఇవ్వలేదు - రాము, ఉప్పరహాళ్ క్రాస్
కనీసం గోనె సంచులు కూడా పంపిణీ చేయలేదు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఖాళీ గోనె సంచి రూ.60 పలుకుతోంది. ధాన్యం ఇంటికి చేర్చడానికి బస్తాకు రూ.40, లారీకి లోడింగ్కు రూ.20 ఖర్చు అవుతోంది. మొత్తంగా కల్లం నుంచి లారీలో లోడింగ్ వరకు బస్తాకు రూ.120 చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం హమాలీ ఖర్చులు భరించాలి.
సాంకేతిక సమస్యతో ఆలస్యం : వెంకటరాముడు, జిల్లా మేనేజరు, సివిల్ సప్లై
జిల్లాలో 2,500 టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతిక సమస్యతో ఆలస్యమవుతోంది. రెండు రోజుల్లో కొనుగోళ్లు మొదలుపెడతా. ప్రభుత్వం క్వింటాకు రూ.1960 నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగు పడిపోయింది జగన్.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం
[ 18-04-2024]
అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల పర్వానికి గురువారం నుంచి తెరలేవనుంది. జిల్లాలో అనంత పార్లమెంటు (లోక్సభ), 8 శాసనసభా స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. -
లీజు పేరుతో ట్రాక్టర్లు మాయం ఘరానా ముఠా అరెస్టు
[ 18-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో లీజు పేరిట ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘరానా ముఠా కేసును ఛేదించి కీలక సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. -
తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణుల దాడి
[ 18-04-2024]
ఉరవకొండలో తెదేపా ప్రతినిధులపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెదేపా బూత్ కన్వీనరు నాగభూషణ, నార్పలకు చెందిన అతని మిత్రుడు సంతోశ్తో కలిసి బుధవారం సాయంత్రం డ్రైవర్స్ కాలనీలో ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లారు. -
19న చంద్రబాబు ఎన్నికల ప్రచార సభ
[ 18-04-2024]
ణేకల్లులో ఈనెల 19న సాయంత్రం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
[ 18-04-2024]
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. -
ఎన్నికల వ్యయ పరిశీలకుడి రాక
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు నితిన్ అగర్వాల్ జిల్లాకు చేరుకున్నారు. -
నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం
[ 18-04-2024]
కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. -
‘చెత్త’నూ తొలగించలేని ప్రభుత్వం
[ 18-04-2024]
-
మడకశిరలో వైకాపాకు షాక్
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈర లక్కప్ప సొంత మండలంలోనే ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేసి గట్టి షాక్ ఇచ్చారు. -
కల్యాణ వైభోగమే..
[ 18-04-2024]
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జానకీరాముడి కల్యాణోత్సవం వేలాది మంది భక్తజనం నడుమ వైభవపేతంగా జరిగింది. -
కోడ్ ఉన్నా ఆర్టీసీలో గుట్టుచప్పుడు కాకుండా నియామకం!
[ 18-04-2024]
ఎన్నికల కోడ్ వచ్చి సరిగ్గా నెలరోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో నియామకాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. -
అప్పు ఇచ్చా.. తిరిగి చెల్లించండి!
[ 18-04-2024]
మొన్నటివరకు కళ్యాణదుర్గంలో అధికారం వెలగబెట్టిన మహిళా ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. డబ్బుల కోసం సొంతపార్టీ నాయకుల్ని సైతం వేధించారు. -
ధర్మవరంలో కూటమి జోరు
[ 18-04-2024]
ధర్మవరంలో రాజకీయ గాలి వేగంగా మారుతోంది. మొన్నటివరకు కూటమి, వైకాపా మధ్య పోటాపోటీగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం నామపత్రం స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు నామపత్రాల స్వీకరణ, ఎన్నికల నోటిఫికేషన్ నేడు వెలువడనుంది. -
నేడు బండారు శ్రావణిశ్రీ నామినేషన్
[ 18-04-2024]
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గురువారం నామపత్రాలు దాఖలు చేస్తున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్