ఉపాధి పనులకు రాజకీయ గ్రహణం
అక్కడ ప్రభుత్వ నిబంధనలు వర్తించవు. అధికారుల ఆదేశాల అమలుకు చోటుండదు. నియోజకవర్గంలోని ముఖ్యనేత, ఆయన అనుచరులు చెప్పిందే నిబంధన. వారు చేసిందే శాసనం. గ్రామాల్లో సదరునేత సామాజికవర్గానికి చెందిన స్థానిక నేతల కనుసన్నల్లోనే
చెన్నేకొత్తపల్లిలో క్షేత్రసహాయకుల నియామకంలో ఇష్టారాజ్యం
15 పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి
రాజకీయ పదవులు పంచుకున్నట్లు చెన్నేకొత్తపల్లి మండలంలోని అన్ని పంచాయతీల్లో ఏడాదికి ఒకసారి క్షేత్రసహాయకుల ఉద్యోగాలను పంచుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు చేసినవారికే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గ్రామంలోని అధికార పార్టీ నాయకులు, సానుభూతిపరులకు ఏడాదికి ఒకరుచొప్పున ఉద్యోగాన్ని పంచుకుంటున్నారు.
పనుల్లోనూ కులవివక్ష
గత డిసెంబర్లో అధికారపార్టీ నేతల ఆదేశాల మేరకు చెన్నేకొత్తపల్లి మండలంలోని అన్ని పంచాయతీల క్షేత్రసహాయకులను తొలగించి కొత్తవారిని నియమించారు. ఓ పంచాయతీ క్షేత్రసహాయకుడిగా దళిత యువకుడిని నియమించారు. చేరిన వారానికే స్థానిక నాయకులు ఒక్కటై దళితుడిని దింపేందుకు పన్నాగం పన్నారు. గత నెలలో ఆ యువకుడు రెండు వారాలపాటు కూలీలకు పనులు కల్పించాడు. దీంతో కూలీలు పనులకు వెళ్లకూడదంటూ హుకుం జారీ చేశారు సదరు నేతలు. దళితవ్యక్తి పనులు చూపిస్తే మీరు చేస్తారా అంటూ తన సామాజికవర్గంతోపాటు, పలువురు కూలీల వద్ద విష ప్రచారం చేశారు. దీంతో కూలీలు పనులకు వెళ్లడానికి సంశయిస్తున్నారు. ఉపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు.
నష్టపోతున్న కూలీలు
కూలీలకు ఎందుకు పనులు కల్పించడంలేదని పైఅధికారుల ఒత్తిళ్లు ఓ వైపు, నీకు అవకాశం ఇచ్చాము.. చేతకాకపోతే దిగిపో అని అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు మరోవైపు. మానసికంగా కుంగిపోయిన ఆ యువకుడు రెండువారాల కిందట ఉద్యోగం నుంచి తప్పుకున్నాడు. రాజకీయ ఒత్తిళ్లతో పనులకు ఉపాధి పనులకు వెళ్లలేక, స్థానికంగా పనులు లభించక కూలీల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్క చెన్నేకొత్తపల్లి మండలంలోనే గతేడాది రోజుకు 10 వేల పనిదినాలు సగటున నమోదు కాగా.. ప్రస్తుతం 3 వేలు దాటడం లేదంటే కూలీలు ఎంతగా నష్టపోతున్నారో అర్థమవుతోంది.
నా దృష్టికి రాలేదు - విజయప్రసాద్, డ్వామా పీడీ
నిబంధనల మేరకు అవినీతి, నిర్లక్ష్యం తేలితేనే క్షేత్రసహాయకులను తొలగించాల్సి ఉంటుంది. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏడాదికి ఒకసారి ఎఫ్ఏలను మారుస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఎంపీడీవో, ఏపీడీతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తాను. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే సరిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం.
నియోజకవర్గమంతా ఇంతే
ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గంలో నిబంధనలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. పార్టీ సానుభూతిపరులకు ఏడాది ఒకరికి చొప్పున ఉద్యోగాలు ఇస్తున్నారు. గడువు పూర్తయిన తర్వాత బలవంతపు రాజీనామాలు చేయించి కొత్తవారిని నియమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!