నూలుమిల్లు స్థలం పై తెగని వివాదం
సహకార నూలుమిల్లుకు చెందిన స్థలం అమ్మకం విషయంలో హౌసింగ్బోర్డు అధికారులు, మిల్లు అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలోనని జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో మిల్లుకు సంబంధించి మొత్తం 56 ఎకరాల స్థలాలు ఉన్నాయి. దీనిలో 16
మూతపడ్డ ఆంధ్రా సహకార స్పిన్నింగ్ మిల్లు
న్యూస్టుడే: గుంతకల్లు : సహకార నూలుమిల్లుకు చెందిన స్థలం అమ్మకం విషయంలో హౌసింగ్బోర్డు అధికారులు, మిల్లు అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీన్ని ఏవిధంగా పరిష్కరించాలోనని జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో మిల్లుకు సంబంధించి మొత్తం 56 ఎకరాల స్థలాలు ఉన్నాయి. దీనిలో 16 ఎకరాలను ఎకరా రూ.80 లక్షల వంతున ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు అమ్మడానికి ప్రభుత్వం 2012 సంవత్సరంలో నిర్ణయించింది. 16 ఎకరాలను మిల్లుకు చెందిన స్థలాల్లో సర్వేనెంబర్లు 620, 621, 624లో ఇచ్చేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం 16 ఎకరాల కోసం మిల్లుకు రూ.12.80 కోట్లను హౌసింగ్ బోర్డు అధికారులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు హౌసింగ్బోర్డు అధికారులు రూ.5.60 కోట్లను అందజేయగా.. ఈ మొత్తాన్ని మిల్లులో పనిచేసే కార్మికులకు బకాయిల కింద చెల్లించారు. ఇంకా హౌసింగ్బోర్డు అధికారులు మిల్లుకు రూ.7.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. మిల్లు అధికారులు ఇప్పటివరకు బోర్డు వారికి ఐదు ఎకరాలను స్వాధీనం చేశారు. మొత్తం 16 ఎకరాలను బోర్డుకు స్వాధీనం చేయాలంటే మిల్లుకు పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.
భారీగా పెరిగిన స్థలాల ధర
హౌసింగ్ బోర్డు అధికారులకు ప్రభుత్వం మిల్లుకు చెందిన స్థలాన్ని గతంలో చాలా తక్కువ ధరకు ఇచ్చింది. అప్పుడు ఎకరా రూ.80 లక్షలు కాగా.. ఇప్పుడు దీని ధర రూ.10 కోట్లుగా అంచనా. బోర్డుతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ప్రభుత్వానికి రూ.150 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం హౌసింగ్ బోర్డు సకాలంలో డబ్బును చెల్లించలేదు కాబట్టి వారికి స్థలాన్ని కేటాయించే ఉత్తర్వులను రద్దుచేసేలా చూడాలని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మిల్లు అధికారులను కోరారు. స్థలాన్ని పట్టణంలోని వారికి ఇళ్లను నిర్మించుకోవడానికి తక్కువ ధరకు కేటాయించడం సమంజసంగా ఉంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించారని ఎమ్మెల్యే ప్రకటించారు.
నష్టపోయిన గుంతకల్లు వాసులు
మిల్లుకు చెందిన స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తామని, ఆసక్తి ఉన్నవారు హౌసింగ్ బోర్డుకు రూ.10 వేలు చొప్పున డిపాజిట్గా చెల్లించాలని తెలపడంతో దాదాపు 250 మంది డబ్బుతో పాటు కొందరు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు 2012 సంవత్సరంలో చెల్లించారు. మిల్లుకు చెందిన స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో డబ్బు కట్టిన వారికి స్థలాల కేటాయింపు జరగలేదు. బోర్డు అధికారులు రూ.10 వేలను మినహాయించుకుని మిగిలిన మొత్తాలను వారికి వాపసు ఇస్తున్నారు. ఈ విషయంలో తాము బోర్డు వారిని నమ్ముకుని డబ్బును కోల్పోతున్నామని పలువురు వాపోతున్నారు.
సమస్య ఏమిటంటే..
స్థలాలను మూలన కాకుండా రోడ్డు పక్కన, మిల్లు లోపల ఉన్నవి ఇవ్వాలని హౌసింగ్బోర్డు అధికారులు పట్టుబడుతున్నారు. అలా ఇవ్వడానికి వీలుకాదని, తాము ఇచ్చే భూమిని మాత్రమే తీసుకోవాలని మిల్లు అధికారులు వాదిస్తున్నారు. దీంతో మిల్లుకు చెందిన స్థలాలను బోర్డుకు అప్పగించే అంశంతో పాటు బోర్డు నుంచి మిల్లుకు బకాయిల చెల్లింపు ఆగిపోయింది. స్థలాల కేటాయింపు విషయంలో వివాదం గత ఎనిమిది సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయింది. సమస్యను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపలేదు.
వారి తీరు సరికాదు
హౌసింగ్బోర్డు అధికారులు ఒప్పందం చేసుకున్న విధంగా స్థలాలను తీసుకోకుండా తమకు రోడ్డు పక్కన, మిల్లు లోపల కావాలని పట్టుబట్టడం సమంజసంగా లేదు. వారు సకాలంలో డబ్బును చెల్లించకుండా చాలా జాప్యం చేశారు. స్థలాల విషయాన్ని, డబ్బు చెల్లించే అంశాన్ని గాలికి వదిలేశారు.మిల్లు స్థలాల విలువ గణనీయంగా పెరిగినందున ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - మిల్లు అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకో పాలనలో సర్వం నష్టం
[ 20-04-2024]
‘నాకు అనంతపురం కొత్త కాదు, రాయదుర్గమూ కొత్త కాదు, ఎన్నికల్లో మీ అందరిలో చైతన్యం తీసుకురావాలని, ఐదేళ్లు ఒక సైకో పరిపాలనలో మీరేం నష్టపోయారో చెప్పడానికి వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన చూస్తున్నాను. ఇది రాష్ట్రానికి శుభసూచికం.’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. -
కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
[ 20-04-2024]
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. -
అనంత ప్రాజెక్టులపై కాస్త కనికరమైనా లేదా?
[ 20-04-2024]
అసలే కరవు జిల్లా. నీటి వనరులను ఒడిసి పట్టుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. -
ట్రాఫిక్ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు
[ 20-04-2024]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. -
పుంజుకున్న నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పుంజుకుంది. -
పురంలో బాలయ్య ర్యాలీ
[ 20-04-2024]
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సాయంత్రం పట్టణంలో చేపట్టిన ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా తరలిరావచ్చారు. -
వైకాపా పాలనలో గార్మెంట్స్ పరిశ్రమ కుదేలు
[ 20-04-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు ప్రసిద్ధి.. ఏటా కోట్లలో వ్యాపారం జరిగేది. -
అరాచక పాలనను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
[ 20-04-2024]
ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే మున్సిపాలిటీ అభివృద్ధితోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా
[ 20-04-2024]
రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ హామీ ఇచ్చారు. -
అధికారంలోకి వచ్చేది తెదేపానే
[ 20-04-2024]
తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. భానుడు సెగలు కక్కుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది కార్యకర్తలు తెదేపా జెండాలను చేతపట్టుకొని భారీగా ర్యాలీ నిర్వహించారు. -
ప్రజాగళం.. పోటెత్తిన జనం
[ 20-04-2024]
కణేకల్లులో శుక్రవారం జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. -
పక్కాగా అభ్యర్థుల ఖర్చు లెక్కింపు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారి ఖర్చులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్/డీఈఓ డాక్టర్ వినోద్కుమార్, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్ వి.షిండే, నితిన్ అగర్వాల్, రాందాస్ టి.కాలే పేర్కొన్నారు. -
జడ్జికి సత్కారం
[ 20-04-2024]
స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎం.శంకరరావు బదిలీపై అనంతపురం వెళుతుండగా శుక్రవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు.