కలెక్టర్ ఉత్తర్వు బేఖాతరు!
అనేక రకాల అభియోగాలు ఎదుర్కొంటున్న శిశుగృహ సోషల్ వర్కర్ బదిలీ స్థానంలో చేరలేదు. కలెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వునే బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. సదరు ఉద్యోగి వారం రోజులు గడిచినా రిలీవ్ కాలేదు. హిందూపురానికి చెందిన ఓ మహిళ దత్తత విషయంలో సదరు ఉద్యోగిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చే
బదిలీ స్థానంలో చేరని శిశుగృహ ఉద్యోగి
అనంతపురం(శ్రీనివాస్నగర్), న్యూస్టుడే: అనేక రకాల అభియోగాలు ఎదుర్కొంటున్న శిశుగృహ సోషల్ వర్కర్ బదిలీ స్థానంలో చేరలేదు. కలెక్టర్ నాగలక్ష్మి ఉత్తర్వునే బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. సదరు ఉద్యోగి వారం రోజులు గడిచినా రిలీవ్ కాలేదు. హిందూపురానికి చెందిన ఓ మహిళ దత్తత విషయంలో సదరు ఉద్యోగిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేయడంతో ముడుపుల తతంగం తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించింది. ఈనెల 11న ‘దత్తతలో మాయాజాలం!’ అన్న కథనానికి స్పందించిన కలెక్టర్ విచారణ చేయించారు. సీనియర్ సీడీపీఓ వనజా అక్కమ్మ సమగ్ర విచారణ చేసి నివేదిక పంపారు. సదరు ఉద్యోగిని సత్వరమే రిలీవ్ చేసి.. బదిలీ స్థానంలోకి పంపాలంటూ 17న కలెక్టర్ ఉత్తర్వు జారీ చేశారు. అదే రోజే బదిలీ ఉత్తర్వును సదరు ఉద్యోగి వాట్సప్ నెంబరుకు పంపారు. సోషల్ వర్కర్ రెండు రోజులు శిశుగృహకు వచ్చి వెళ్లారు. రిలీవ్ కాలేదు. ఎలాంటి సెలవు మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. మరో వైపు.. శిశుగృహ సిబ్బంది ఫిర్యాదు మేరకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. హిందూపురం మహిళ ఫిర్యాదు, విచారణ చేసిన వ్యవహారం.. వంటి అంశాలేవీ బదిలీ ఉత్తర్వులో పేర్కొనలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ సుశీలాదేవిని వివరణ కోరగా.. ఆమె నివాసం ఎక్కడుందో తెలియదు. వాట్సప్ ద్వారా ఉత్తర్వు పంపాం. ఆమె రిలీవ్ కాలేదు, బదిలీ స్థానంలో చేరలేదు. తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అçËకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నామపత్రాల్లో అభ్యర్థుల ఆస్తిపాస్తులు
[ 19-04-2024]
నామినేషన్ మొదలైన తొలిరోజు పలు పార్టీల అభ్యర్థులు వారి ఆస్తిపాస్తులు, విద్యార్హత, కేసుల వివరాలను నామపత్రాల్లో దాఖలు పర్చారు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్