ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలి
ఈ ఏడాది జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురవడంతోపాటు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఖరీఫ్లో రైతులు సాగు చేసే వర్షాధార పంటల వివరాలు, వాటి యాజమాన్య పద్ధతులపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి వివరించారు. పంటల ది
‘న్యూస్టుడే’తో వ్యవసాయ శాస్త్రవేత్త సహదేవరెడ్డి
సహదేవరెడ్డి, శాస్త్రవేత్త
బుక్కరాయసముద్రం, న్యూస్టుడే: ఈ ఏడాది జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురవడంతోపాటు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఖరీఫ్లో రైతులు సాగు చేసే వర్షాధార పంటల వివరాలు, వాటి యాజమాన్య పద్ధతులపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి వివరించారు. పంటల దిగుబడి పెరగాలంటే విత్తనాల ఎంపిక, భూసార పరీక్షలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఖరీఫ్లో పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ప్రణాళికను శాస్త్రవేత్త వివరించారు.
సాగు విస్తీర్ణం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా వేరుసెనగ 55 లక్షల హెక్టార్లు, పప్పుశనగ 23 లక్షలు, కంది 12 లక్షలు, సజ్జ 6 వేల హెక్టార్లు, చిరుధాన్యాలు 8 వేల హెక్టార్లు, పత్తి 29 లక్షల హెక్టార్ల చొప్పున వర్షాధార పంటలు సాగవుతాయని శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు. భూమిలో తేమ శాతం బట్టి రైతులు జూన్ 15 నుంచి జులై 30 వరకూ వర్షాధార పంటలు సాగు చేయడానికి అనుకూలమైన సమయమని ఆయన చెప్పారు.
లోతు దుక్కులు అవసరం
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసినందున భూమిలో తగినంత తేమ ఉంది. రైతులు భూముల్లో వాలుకు అడ్డంగా ట్రాక్టరు నాగళ్లతో 20 సెం.మీ లోతు దుక్కులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భూమిలో గడ్డిజాతి మొక్కల వేర్లు, కీటకాలు, పురుగులు పైకి వచ్చి ఎండకు నశిస్తాయి. తద్వారా కలుపు సమస్యలు, తెగుళ్ల బెడదను సమర్థవంతంగా అరికట్టవచ్ఛు పొలంలో ఫారంపాండ్లు తవ్వుకుని పొలం చుట్టూ కందకాలు ఏర్పాటు చేస్తే వర్షంనీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఐదేళ్లకు ఒకసారి చెరువు మట్టిని పొలంలో చల్లుకుంటే పోషకాలు సమృద్ధిగా పైరుకు అందుతాయి. ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్త తెలిపారు.
విత్తన ఎంపిక, భూసార పరీక్షలు, విత్తనశుద్ధి అత్యంత కీలకం
పంటల సాగులో విత్తనాల ఎంపిక, భూసార పరీక్షల ఫలితాలు దిగుబడిపై అధిక ప్రభావం చూపుతాయి. భూసార పరీక్షల్లో భూమిలో పోషకాల లభ్యత, లోపాలు తెలుస్తాయి. ఈ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయాలు కూడా తెలుస్తాయి. రైతులు గుర్తింపులేని వ్యక్తుల వద్ద, దుకాణాల్లో విత్తనాలు కోనుగోలు చేయకూడదు. ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లో విత్తనం కొనుగోలు చేసి రసీదు తీసుకోవాలి. విత్తే ముందు తప్పని సరిగా విత్తనశుద్ధి చేసుకుంటే నెల రోజుల వరకూ పంటకు తెగుళ్లు రాకుండా అరికట్టవచ్ఛు నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను రక్షించడానికి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వేరుసెనగ, ఆముదం, కంది, సజ్జ విత్తనాలను విక్రయిస్తున్నామని శాస్త్రవేత్త తెలిపారు.
నల్లరేగడి నేలల్లో సాగు చేసే పంటల వివరాలు
జిల్లాలో నల్లరేగడి భూముల్లో రైతులు జూన్, జులైలో వర్షాధారంగా పత్తి, పప్పుశనగ, కొర్ర, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్ఛు ఆగస్టులో ఈ పంటలు సాగు చేస్తే దిగుబడి తగ్గుతుంది.
ఎర్రనేలలో.. జిల్లాలో ఎర్రనేలలు అధికంగా ఉన్నాయి. అందులో వేరుసెనగ, పప్పుశనగ, ఆముదం, జొన్న, సజ్జ, అలసంద పంటలను జూన్, జులై 30 వరకూ సాగు చేయడానికి అనువైన సమయం. మే నెలలో వర్షాలు కురిసినందున కొందరు రైతులు ముందుగానే పంటలు సాగు చేస్తున్నారని, అలా చేస్తే దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్త పేర్కొన్నారు.
అనువైన విత్తన రకాలు
వేరుసెనగ: వేమన, కదిరి, ప్రసూన, అనంత, అభయ, గ్రీశ్మ, ధరణి.
కంది: ఎల్ఆర్జీ-41, ఐసీపీఎల్-85063, ఎల్ఆర్జీ-330, పీఆర్జీ-100, పీఆర్జీ-158.
జొన్న: సీఎస్హెచ్-9, 13, 14 రకాలు, సీఎస్వీ- 12, 13 రకాలు.
పత్తి : నరసింహా, శివానంది, సవిత, ఎల్హెచ్ఏ-5166.
ఆముదం: క్రాంతి, జ్యోతి, పీసీహెచ్-111, 222 రకాలు.
కొర్ర: ప్రసాద్, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, సూర్యనంది ప్రసాద్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్