Andhra News: అనంతపురం జిల్లాలో నకిలీ జాయింట్ కలెక్టర్ హల్చల్
శెట్టూరు మండలంలో జేసీ పేరిట ఓ మహిళ బుధవారం హల్చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్పై ఆరా తీసింది.
చింతర్లపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న సింధూరి
శెట్టూరు, న్యూస్టుడే: అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జేసీ(జాయింట్ కలెక్టర్) పేరిట ఓ మహిళ బుధవారం హల్చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్పై ఆరా తీసింది. అనంతరం శెట్టూరు పీహెచ్సీకి వచ్చింది. వైద్యుడి కుర్చీలో కూర్చుని.. సిబ్బంది ఎవరెవరు ఎక్కడి నుంచి విధులకు వస్తున్నది, మందుల నిల్వ వివరాలు అడిగింది. సచివాలయాల సిబ్బంది విషయాన్ని తహసీల్దారు శంకరయ్య, ఎంపీడీవో వెంకటనాయుడు, ఎస్సై యువరాజ్కు చేరవేశారు. వారందరూ పీహెచ్సీకి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. జేసీ హోదాతోనే తనిఖీ చేస్తున్నానని, ఎక్కడైనా విచారించుకోండని చెప్పడంతో తహసీల్దార్ కలెక్టరేట్కు ఫోన్ చేశారు. ఆ పేరుతో జేసీ ఎవరూ జాయిన్ కాలేదని చెప్పడంతో నకిలీగా నిర్ధారించుకుని కలెక్టరేట్కు తీసుకెళ్లారు. అక్కడ జేసీ కేతన్గార్గ్ ఆమె వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం శెట్టూరుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఆమె వెంట శెట్టూరు మండలం ములకలేడు ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఉన్నారు. ఎస్సై మాట్లాడుతూ సింధూరి సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురమని, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిందని తెలిపారు. గతంలో జిల్లాకేంద్రంలో పదో తరగతి స్క్వాడ్గా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓ వైద్యుడిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించిందని, రెండు ప్రైవేటు పాఠశాలలు, బత్తలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.