కుంటపై కన్నేశారు!
టి వనరుల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమార్కులు వాటి ఉనికే లేకుండా చేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న సుబేదారుకుంటలో కొన్ని దశాబ్దాలుగా నీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని
మట్టితో చదును
స్థిరాస్తి వ్యాపారానికి యత్నం
సుబేదారు కుంటను మట్టితో చదును చేస్తున్నారిలా.
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, కళ్యాణదుర్గం: నీటి వనరుల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తోంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమార్కులు వాటి ఉనికే లేకుండా చేస్తున్నారు. కళ్యాణదుర్గం పట్టణానికి ఆనుకుని ఉన్న సుబేదారుకుంటలో కొన్ని దశాబ్దాలుగా నీరు నిల్వ ఉంటోంది. పట్టణంలోని వరద నీరు మొత్తం ఇక్కడికే వచ్చి చేరుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. కుంట నీటిని ఆధారంగా కొందరు పంటలు పండిస్తున్నారు. దీనికి ఆనుకుని జాతీయ రహదారి ఉండటంతో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. తాజాగా కొందరు వ్యక్తులు కుంట ప్రాంతాన్ని మట్టితో చదును చేస్తుండటం వివాదానికి దారీ తీసింది. చెరువును పూడ్చేసి, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుంట ఆనుకుని ఓ వెంచర్ సిద్ధం చేశారు. ప్రైవేటు వ్యక్తులు కుంట ప్రాంతం చదును చేసి వెంచర్లు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
నిబంధనలు ఉన్నా..
పూర్వం గ్రామాల్లోని అత్యధిక శాతం భూమి కరణాల పేరు మీదనే ఉండేది. చెరువులు, నీటి కుంటలు కూడా డైగ్లాట్లో కరణాల పేరుతో నమోదైనట్లు అధికారులే చెబుతున్నారు. నిజానికి చెరువులు, నీటి కుంటలకు సంబంధించి పట్టా భూములైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో వాటిని పూడ్చివేయడం, తొలగించడం వంటివి చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. దీన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. సుబేదారుకుంటను పూడ్చేందుకు మట్టి తవ్వకాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. కుంటను పూడ్చివేసే పనుల్ని మాత్రం నిలిపేసేందుకు అధికారులకు ధైర్యం రావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నీటి వనరులైన చెరువులు, కుంటలు పట్టాభూమిలో ఉన్నా సాధ్యమైనంతవరకు వ్యవసాయానికే వినియోగించాలని నిబంధనలు ఉన్నాయి.
రికార్డులో ఒకలా.. పటంలో మరోలా
కళ్యాణదుర్గం ఆనుకుని సర్వే నెంబరు 329లో 92.81 ఎకరాల విస్తీర్ణం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 44 మంది పేర్లతో పట్టాలు ఉన్నాయి. ఇందులో 19 ఎకరాలను సీలింగ్ కింద ఆరుగురు రైతులకు కేటాయించారు. 1.50 ఎకరాలను అనంతపురం-రాయదుర్గం జాతీయ రహదారి నిర్మాణానికి తీసుకున్నారు. ఖాతా నెం 28 ప్రకారం పంపన్నగారి గంగమ్మ, ఓరుగళ్లప్పగారి కరణం చిక్కప్ప, ఓరుగళ్లప్పగారి కరణం తిప్పేస్వామి పేర్ల మీదుగా పట్టాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 ఎకరాల్లో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంటోంది. ఆ భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమి అయినప్పటికీ గ్రామ పటంలో మాత్రం ‘సుబేదారుచెరువు’గా నమోదు చేశారు. రికార్డుల్లో ఒకలా.. గ్రామపటంలో మరోలా ఉండటంతో వివాదం తలెత్తుతోంది. ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా నీటి కుంట ఉందని.. అది పట్టాభూమి కాదని స్థానికులు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ధనార్జన కోసమే కుంటను పూడ్చి వ్యాపారం చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెదేపా నాయకులు రెండు రోజులపాటు దీక్ష చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఇదీ వివాదం
కుంట విస్తరించి ఉన్న భూమికి సంబంధించి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కొందరు 2015లో అప్పటి ముఖ్యమంత్రి పేషీలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అప్పటి తహసీల్దార్ రికార్డులు పరిశీలించి 329 సర్వే నంబరులో 92 ఎకరాలను పట్టాభూమిగా తేల్చారు. అందులోని దక్షిణం వైపున 33 ఎకరాల విస్తీర్ణం వరకు నీటి నిల్వ ప్రాంతంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించే వరకు సదరు సర్వే నంబరుపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని 2020లో అప్పటి జేసీ డిల్లీరావు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకు విచారణ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీచేశారు.
పట్టణానికి వరద ముప్పు
సుబేదారుకుంటను పూడిస్తే భూగర్భ జలాలకే కాకుండా కళ్యాణదుర్గం పట్టణానికి కూడా ముప్పు పొంచి ఉంది. పట్టణంలోని శివారు కాలనీల నుంచి వచ్చే వరద నీరు మొత్తం ఈ కుంటలోకి వచ్చి చేరుతుంది. డ్రైనేజీ కూడా ఇందులోనే కలుస్తోంది. కుంటను చదును చేస్తే భారీ వర్షాలు కురిసిన సమయంలో పట్టణానికి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ కోణంలోనూ సుబేదారుకుంటను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
రికార్డుల్లో పట్టాభూమిగానే ఉంది
సర్వే నంబరు 329కు సంబంధించి అన్ని రికార్డుల్లో పట్టాభూమిగానే నమోదై ఉంది. దీనిపై గతంలోనే జేసీ స్థాయిలో విచారణ జరిపి పట్టాభూమిగానే తేల్చారు. తాజా వివాదం నేపథ్యంలో క్షుణ్ణంగా రికార్డులు పరిశీలించాలని తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేశాం. - నిశాంత్రెడ్డి, ఆర్డీవో, కళ్యాణదుర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు-నేడు జగన్మాయ
[ 19-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. -
నామినేషన్ల పర్వం ఆరంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం ఆరంభమైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. -
తండ్రి ఆశయాన్నీ నెరవేర్చలేని జగన్: షర్మిల
[ 19-04-2024]
‘‘హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి అనంత జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరివ్వాలన్నది దివంగత సీఎం వైఎస్సార్ లక్ష్యం. -
నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు
[ 19-04-2024]
కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. -
నేడు బాలకృష్ణ నామినేషన్ పత్రాల దాఖలు
[ 19-04-2024]
హిందూపురం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధరలు శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రమాదకరం
[ 19-04-2024]
ఈ నెల 16వ తేదీన ముదిగుబ్బ మండలంలోని మలకవేములక్రాస్లో మిద్దెపై ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. -
విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు
[ 19-04-2024]
సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. -
జగన్ పాలనలో అన్నీ కోతలే
[ 19-04-2024]
యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నామపత్రాల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడు కణేకల్లులో చంద్రబాబు సభ
[ 19-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. -
రైతులను విస్మరించిన వైకాపా ప్రభుత్వం
[ 19-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రైతులను పూర్తిగా విస్మరించిందని తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. -
గ్రామాల అభివృద్ధికే రాజకీయాల్లోకి.. : అమిలినేని
[ 19-04-2024]
గ్రామాల అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. -
కోడ్ ఉల్లంఘించి ఫ్లెక్సీల ఏర్పాటు
[ 19-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
గొర్రెల యజమానులతో రెవెన్యూ అధికారి డబ్బుల డిమాండ్
[ 19-04-2024]
గొర్రెల యాజమానుల నుంచి ఓ రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి