కోట్ల భవనం.. నిరుపయోగం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించి తద్వారా స్వయం ఉపాధికి, పట్టణంలో పరిశ్రమ అభివృద్ధికి నిర్మించిన సాధారణ సదుపాయాల కేంద్రం(సీఎఫ్సీ) నాలుగైదేళ్లుగా నిరుపయోగంగా మారింది. వెలుగు, డీఆర్డీఏ అధికారులు
మూతపడిన సీఎఫ్సీ భవనం
రాయదుర్గం, న్యూస్టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంపొందించి తద్వారా స్వయం ఉపాధికి, పట్టణంలో పరిశ్రమ అభివృద్ధికి నిర్మించిన సాధారణ సదుపాయాల కేంద్రం(సీఎఫ్సీ) నాలుగైదేళ్లుగా నిరుపయోగంగా మారింది. వెలుగు, డీఆర్డీఏ అధికారులు పట్టించుకోకపోవటంతో రూ.1.50 కోట్లతో నిర్మించిన భవనం, రూ.40 లక్షల విలువైన 120 అధునాతన జూకీ కుట్టుయంత్రాలు వృథాగా ఉన్నాయి. వెలుగు ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 10 వేల మంది మహిళలకు దుస్తుల తయారీలో నైపుణ్యం పెంచి వారి ఆధ్వర్యంలోనే సీఎఫ్సీని స్వతంత్రంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాటు చేశారు.
నెరవేరని లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లతో దుస్తులు తయారుచేసి దేశంలోని ప్రముఖ కంపెనీలకు ఎగుమతి చేయటం ద్వారా మార్కెట్ సౌకర్యాన్ని వృద్ధి చేసి తద్వారా కంపెనీ నిర్వహణను మ్యాక్స్ సొసైటీకి అప్పగించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఆరంభంలో సీఎఫ్సీ నిర్వహణను నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఇచ్చినా కార్యరూపం దాల్చ లేదు. మధ్యలో బెంగళూరుకు చెందిన ఒక సంస్థకు, టాటా సంస్థకు బాధ్యతలు అప్పగించినా మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. స్థానికులు ఆసక్తి చూపినా తక్కువ బాడుగ అడుగుతున్నారనే ఉద్దేశ్యంతో అధికారులు ముందడుగు వేయలేదు.
త్వరలో ప్రారంభానికి చర్యలు..
సీఎఫ్సీ నిర్వహణకు ప్రైవేటు వ్యాపారులు ముందుకొస్తున్నారు. నెలకు ప్రభుత్వం రూ.50 వేలు నిర్ణయించగా ప్రైవేటు వ్యాపారులు రూ.30 వేలు చొప్పున బాడుగ ఇవ్వటానికి ముందుకొస్తున్నారు.చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
-గంగాధర, వెలుగు ప్రాంతీయ సమన్వయ అధికారి, రాయదుర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం
[ 29-03-2024]
ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
[ 29-03-2024]
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. -
కాలుతున్న కడుపులు.. ఏవీ ఉపాధి బిల్లులు?
[ 29-03-2024]
వారంతా దినసరి కూలీలు. రోజు పని చేస్తే తప్ప కుటుంబాలను పోషించుకోలేని స్థితి. పొట్టకూటి కోసం ఎండలో ఎండుతూ పనులు చేస్తున్నారు. -
ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు
[ 29-03-2024]
పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్లలో కౌన్సిల్ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి బలవన్మరణానికి యత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
అప్పుల వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక భార్యాభర్తలు, కుమారుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. -
33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం
[ 29-03-2024]
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకోడానికి 33 శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని డీఆర్వో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చికెన్ వ్యాపారి కిడ్నాప్
[ 29-03-2024]
కొత్తచెరువులో చికెన్ సెంటర్ యజమాని ఉప్పు వెంకటాచలపతిని కిడ్నాప్ చేసిన కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పారదర్శకంగా పనిచేయాలి: ఎస్పీ
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా అంకితభావంతో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 29-03-2024]
శ్రీసత్యసాయి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. -
మరుగున మురుగు పారుదల వ్యవస్థ
[ 29-03-2024]
పురపాలకలో డ్రైనేజీ వ్యవస్థ ప్రధానమైంది. అందుకే పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకంగా ప్రజారోగ్య విభాగంలో కార్మికుల ఏర్పాటుతో పరిసరాల శుభ్రతను పాటిస్తారు. -
తెదేపా అధినేతకు ఘనస్వాగతం
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం అనంతపురం గ్రామీణం ప్రసన్నాయపల్లి హెలీప్యాడ్ వద్ద అనంతపురం -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
[ 29-03-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్నూలు జిల్లా దేవనకొండ -
కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు
[ 29-03-2024]
వచ్చే ఖరీఫ్ సీజన్కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు