logo

ముద్దిరెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం

పట్టణ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.30 లక్షలు విలువైన పట్టుచీరలు, ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు. పట్టు చీరలకు వేసిన పాలిష్‌ ఆరడానికి

Published : 26 May 2022 03:53 IST

 రూ.30 లక్షల విలువైన ఆస్తి నష్టం  

హిందూపురం పట్టణం: పట్టణ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.30 లక్షలు విలువైన పట్టుచీరలు, ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు. పట్టు చీరలకు వేసిన పాలిష్‌ ఆరడానికి గదిలో హీటర్‌ ఆన్‌ చేసి ఉంచారు. పని నిమిత్తం తలుపులు వేసి, కాసేపు బయటకు వెళ్లారు. అంతలోనే మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతంతో గదిలోని చీరలు, ఇతర వస్తువులకు మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాదంతో పూర్తిగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని