2 ఏళ్లన్నారు .. ఏళ్లయినా పలకరు!
కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం 1989లో హంద్రీనీవా పథకానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదుల్ని అనుసంధానం చేసి కృష్ణా జలాలను తరలించాలనేది ప్రధాన ఉద్దేశం.
హంద్రీనీవా ప్రగతిపై మాటతప్పిన ప్రభుత్వం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్టుడే, ఉరవకొండ
ఉరవకొండ పరిధిలోని హంద్రీనీవా ఉపకాలువ
కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేయడం కోసం 1989లో హంద్రీనీవా పథకానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదుల్ని అనుసంధానం చేసి కృష్ణా జలాలను తరలించాలనేది ప్రధాన ఉద్దేశం. అప్పటినుంచి 2019 వరకు పనిచేసిన ప్రభుత్వాలన్నీ పథకం పనుల్ని ఎంతోకొంత ముందుకు తీసుకెళ్లాయి. అయితే వైకాపా ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రతిపక్ష హోదాలో సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు నీటిమీద రాతలుగా మారిపోయాయని రైతులు విమర్శిస్తున్నారు.
గతంలోనే 95 శాతం పూర్తి..
హంద్రీనీవా ఫేజ్-1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. అప్పటినుంచి జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరుతున్నాయి. అయితే పక్కనే నీరు ప్రవహిస్తున్నా వినియోగించలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం హంద్రీనీవా కాలువ నుంచి ఆయకట్టుకు నీరందించే ఉప, పిల్లకాలువలు పూర్తికాకపోవడమే. 33, 34, 36 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టారు. ఈ మూడు ప్యాకేజీల పనులను వివిధ ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. 33వ ప్యాకేజీకి సంబంధించి 96 శాతం, 34 ప్యాకేజీలో 95 శాతం పనులు గతంలోనే పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టులు, అక్విడెట్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటిని పూర్తి చేస్తే చెరువులను నింపి ఆయకట్టుకు నీరందించవచ్ఛు అప్పటివరకు చేసిన బిల్లులు పెండింగ్లో ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. 2, 3 శాతం పనులు మాత్రమే పూర్తికావాల్సిన నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
అనుమతుల కోసం నిరీక్షణ
ప్యాకేజీ 36కు సంబంధించి 18 శాతమే పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 శాతం కంటే తక్కువ పూర్తయిన పనుల్ని రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ ప్యాకేజీ పనుల్ని రద్దు చేశారు. తర్వాత పనుల్ని పూర్తిచేయడానికి రూ.600 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఇందులో భూసేకరణ కోసం రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రతిపాదనల్లో కొన్ని సవరణలు సూచిస్తూ ప్రభుత్వం వెనక్కి పంపినట్లు సమాచారం. ఈ మూడు ప్యాకేజీలు పూర్తయితే జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం పరిధిలోని 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
ఆందోళనలో అన్నదాతలు
హంద్రీనీవా ప్రధాన, ఉపకాలువల నిర్మాణంలో భాగంగా చాలామంది రైతులు తమ భూమిని కోల్పోయారు. తమకున్న పొలంలో కొంత కాలువ నిర్మాణం కోసం పోయినా కృష్ణా జలాలతో మిగిలిన భూమిలో వ్యవసాయం చేయవచ్చని రైతులు ఆశపడ్డారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆశలు నెరవేరే దిశగా అడుగులు పడటం లేదు. రైతుల పొలాల గుండా తవ్విన పిల్లకాలువలు ఇప్పటికే చాలావరకు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. హంద్రీనీవా పథకం కింద ఇప్పటివరకు ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నీరు అందించకపోవడం గమనార్హం.
నాటిమాట
‘నాన్నగారి హయాంలో హంద్రీనీవాకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఫేజ్-1లో 90 శాతం పనులు పూర్తిచేశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా తక్కిన 10 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తిచేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్ఛు ప్రాజెక్టు పూర్తిచేయకపోతే పోరాటం చేస్తాం. లేదంటే మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీనీవాను పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తాం.’’ 2017 ఫిబ్రవరి 6న ఉరవకొండలో జరిగిన మహాధర్నాలో ప్రతిపక్షహోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి వాఖ్యలివి.
నేటి పరిస్థితి..
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకు ఒక్కశాతం పనులు కూడా ముందుకు సాగలేదు. గతంలో తవ్విన కాలువలు కూడా కంపచెట్లతో దర్శనమిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటరీల కాలువలు పూర్తిగా రూపం కోల్పోయాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకురావడం లేదు. కొన్ని ప్యాకేజీల్లో పనులు రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. కళ్లముందే నీరు ప్రవహిస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోండి
[ 24-04-2024]
ఎన్నికల విధులకు నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఇసుకంతైనా భయం లేదు.. దోపిడీ ఆగదు
[ 24-04-2024]
ఆస్తిని పంచుకున్నట్లు.. ప్రకృతి వనరులైన నదులు, వాగులు, వంకలను వైకాపా నాయకులు పంచేసుకున్నారు. జగన్ అండతో నదుల్ని వాటాలేసుకుని మరీ అక్రమ రవాణా కొనసాగించారు. ఉమ్మడి అనంత జిల్లాలోని పెన్నా, చిత్రావతి, వేదవతి, జయమంగళి తదితర నదుల్ని నామరూపాల్లేకుండా చేశారు. -
నమ్మండి.. జగనన్న కాలనీనే..
[ 24-04-2024]
వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి, గూళ్యపాళ్యం, కమలపాడు, పీసీప్యాపిలి గ్రామాల్లోని జగనన్న కాలనీలు ముళ్లపొదలతో నిండిపోయాయి. గడేహోతూరులో 73 ఇళ్లు, వజ్రకరూరులో 578 పట్టాలకుగాను 121, కొనకొండ్లలో 830కుపైగా పట్టాలు పంపిణీ చేస్తే 181 ఇళ్లు పూర్తయ్యాయి. -
ఒకే రోజు యాభై నామినేషన్లు
[ 24-04-2024]
జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే అసెంబ్లీ స్థానాలకు ఏకంగా యాభై నామినేషన్లు దాఖలు కావడం విశేషం. పార్లమెంటు స్థానానికి రెండు వచ్చాయి. -
దేవుడి భూమినీ గుల్ల చేశారు
[ 24-04-2024]
జిల్లాలోని పెద్దవడుగూరుకు కూతవేటు దూరంలో ఉన్న నెలగొండరాయుడుస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే సంఖ్య 777-ఎలోని 21.04 ఎకరాల ఎర్రనేల భూముల్లో వైకాపా నేతల కన్ను పడింది. -
రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకే భోజనం
[ 24-04-2024]
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్ తెలిపారు. -
జగన్ .. ఇంకా పరిహారం ఇవ్వలే
[ 24-04-2024]
భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి రూ.542కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో తొలుత రైతుల నుంచి భూమిని సేకరిస్తేనే కాలువ పనులకు అడుగులు ముందుకు పడతాయి. 1,406 ఎకరాల భూమిని సేకరించడానికి పరిహారంగా రూ.208కోట్లు మంజూరు చేస్తున్నాను. -
ఉద్యాన రైతుల ఊపిరితీస్తున్న జగన్!
[ 24-04-2024]
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ప్రధానంగా చీనీ, దానిమ్మ సాగు ఎక్కువ. గత తెదేపా హయాంలో ఆయా పంటల సాగుకు పెద్దఎత్తున ప్రోత్సహించారు. -
విజయీభవ..
[ 24-04-2024]
ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. -
చేపా..చేపా.. నువ్వెందుకు ఈదలేదు!
[ 24-04-2024]
వైకాపా ప్రభుత్వంలో అన్నదాతలకే కాదు.. చేపల పెంపకానికీ నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాదే మత్స్య క్షేత్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తి చేపట్టారు. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాల్సి ఉంది. -
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు
[ 24-04-2024]
దయ్యాలకుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులో గువ్వలగొండి కొండలో ఫాం పాండు పనులు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తున్నా.. చర్యలు సున్నా
[ 24-04-2024]
ఉద్యోగులు యథేచ్ఛగా వైకాపా ప్రచారంలో పాల్గొంటున్నా అధికారులకు కన్పించడం లేదు. కోడ్ ఉల్లంఘించే వారిపై పరిశీలించి సొంతంగా చర్యలు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఉంది. -
జగన్ పాలనలో .. ఉద్యానాలు కనుమరుగు
[ 24-04-2024]
జగన్ ప్రభుత్వంలో పట్టణవాసికి ఆహ్లాదాన్ని అందించాల్సిన ఉద్యానవనాలు ఉనికిని కోల్పోయాయి. వీటిని సంరక్షించాల్సిన పురపాలికలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొత్త పార్కుల ఏర్పాటును గాలికి వదిలేశారు. -
తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం
[ 24-04-2024]
సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. -
ధర్మవరంలో కూటమి సందడి
[ 24-04-2024]
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. -
కొండను తవ్వి.. వంకలు పూడ్చి
[ 24-04-2024]
వైకాపా నాయకుల అండతో కొందరు కొండలను మాయం చేస్తున్నారు. మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆక్రమణలకు తెగబడుతున్నారు. కనగానపల్లి మండలం దాదులూరు రెవెన్యూ పంచాయతీలో ఉన్న కుర్లపల్లి గ్రామ సమీపంలో ఓ రియల్టర్ (భూ వ్యాపారస్థుడు) కొన్నేళ్ల క్రితం భూముల్ని కొనుగోలు చేశాడు. -
లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తాం
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వంలో పర్యాటక ఉత్సవాలను నిర్వహించి లేపాక్షి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మారుమోగేలా చేశామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. అటువంటి లేపాక్షిని ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.