బిల్లులు బకాయిలు .. వెలగని వీధి దీపాలు
రాయదుర్గంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రూ.4 లక్షల వరకు సాధారణ నిధులు కేటాయించి రెండుమార్లు టెండర్లు పిలిచినా సరఫరాకు గుత్తేదారులు ముందుకు రాలేదు.
రాయదుర్గంలో అంధకారం
కణేకల్లు రోడ్డులో వెలగని వీధి దీపాలు
రాయదుర్గం, న్యూస్టుడే: రాయదుర్గంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రూ.4 లక్షల వరకు సాధారణ నిధులు కేటాయించి రెండుమార్లు టెండర్లు పిలిచినా సరఫరాకు గుత్తేదారులు ముందుకు రాలేదు. రూ.లక్ష చొప్పున కౌన్సిలర్లకు కేటాయించి బల్బుల ఏర్పాటుకు కౌన్సిల్లో నిర్ణయించినా ఆ ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు.
కానరాని నిర్వహణ..
కొత్త వీధిదీపాల ఏర్పాటు సంగతి దేవుడెరుగు.. కనీసం పనిచేయనివాటి నిర్వహణకు కూడా విడి పరికరాల సరఫరా సక్రమంగా జరగటంలేదు. 32 వార్డుల్లో 3,500కు పైగా వీధి దీపాలున్నాయి. అందులో 300 వరకు వెలగడంలేదు. బకాయిలు పేరుకుపోవడంతో నిర్వహణ బాధ్యత చూడాల్సిన ఈఈఎస్ఎల్ సంస్థ పట్టించుకోవడంలేదు. ప్రతినెలా సదరు సంస్థకు రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్ఎంఎస్ విధానంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.1.64 కోట్ల బకాయిలు ఉన్నాయి.
2వేలకు పైగా కొత్తవి అవసరం..
పట్టణం, శివారు కాలనీలు నానాటికీ విస్తరిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కొత్తబల్బులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇలా దాదాపు 2వేల వరకు అవసరమని గుర్తించారు. ఉన్నవాటికే మరమ్మతులు చేయని నేపథ్యంలో కొత్తవాటి సంగతి మరిచిపోవాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. బకాయిలతో సంబంధం లేకుండా ఈఈఎస్ఎల్ ద్వారా ప్రస్తుతం కేటాయించిన నిధులతో నేరుగా వీధి దీపాల కొనుగోలుకు మున్సిపల్ అధికారులు నిర్ణయించినా నేటికీ చర్యలు తీసుకోలేదు.
పట్టించుకోవడం లేదు..
విద్యుత్తు తీగల లూజ్ కనెక్షన్లతో వీధి దీపాలు సక్రమంగా వెలగడంలేదు. ఒకరోజు వెలిగితే రెండు రోజులు చీకట్లు ఉంటున్నాయి. ఎవరూ పట్టించుకునేవారు లేరు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. -రఫీక్, ఓబుళాచారిరోడ్డు, రాయదుర్గం
పలుచోట్ల ప్రజల అవస్థలు
పట్టణంలోని కణేకల్లు రోడ్డులో అంధకారం నెలకొంది. బళ్ళారిరోడ్డు, కె.బి ప్యాలెస్ రోడ్డు, మొలకాల్మూర్ రోడ్డు, అనంతపురం రహదారితోపాటు పలుచోట్ల అదే పరిస్థితి. ద్విచక్రవాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొండశివారున ఆత్మకూరు వీధి తదితర ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం, విషపురుగుల కారణంగా రాత్రిళ్లు బయటికి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. తరచూ గొలుసు దొంగతనాలు, ఇతర చోరీలు చోటుచేసుకుంటున్నాయి. పట్టణంలో 433 విద్యుత్తు స్తంభాలకు మూడో లైన్ లేదు. ఈదురు గాలులు వీచినప్పుడు, వర్షానికి బల్బులు పనిచేయడంలేదు. సిబ్బందికి తెలిపినా స్పందించటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సాధారణ నిధులతోనైనా కొత్త బల్బులు అమర్చాలని కోరుతున్నారు.
చర్యలు చేపడతాం..
వీధి దీపాలు ఎన్ని పనిచేయడం లేదు, కొత్తవి ఎన్ని అవసరమవుతాయనే విషయంపై వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి నివేదిక కోరాం. సమాచారం అందిన తర్వాత వీధి దీపాల కొనుగోలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం. 175 వీధి దీపాలకు స్థానికంగానే మరమ్మతులు చేయిస్తాం. -దివాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)