అడిగేవారు లేరని .. అడ్డంగా దోచుకొని..
చెరువులు, గుట్టల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
ధర్మవరం పట్టణం, న్యూస్టుడే: అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా.. అధికారపార్టీ నాయకుల అండదండలతో కొందరు కొండలు, గుట్టలను అడ్డంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు, బంజర భూములు, గుట్టల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గోరంత అనుమతి ఉన్నా.. కొండంత తవ్వి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. పలుచోట్ల ప్రమాదకరంగా తవ్వకాలు చేశారు.
ధర్మవరం పట్టణవాసులకు పోతులనాగేపల్లి రెవెన్యూ పొలంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కొన్ని ప్రాంతాలు గుట్టలకు ఆనుకొని పేదలకు ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు కూడా వీలులేకుండా మట్టి తవ్వేశారు. అదేవిధంగా రేగాటిపల్లి గ్రామ కొండ పరిసర ప్రాంతాల్లో మట్టిని తరలించేశారు.
ఇలా వసూలు చేస్తున్నారు..
జగనన్న కాలనీలోని లేఅవుట్లలో పేదలు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. పునాది వేసేందుకు బండరాళ్లు అవసరం. ఇదే అవకాశంగా భావించి అధికార పార్టీ నాయకులు, వ్యాపారులు ట్రాక్టరు బండరాళ్లను రూ.1,000 నుంచి రూ.1,300 చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉన్న గుట్టలను తవ్వి ఈ బండరాళ్లను అనుమతి లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేవిధంగా చెరువులు, కుంటలు, కొండ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వి వాటిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు, పునాదులు పూడ్చడానికి ట్రాక్టరు మట్టిని రూ.800 నుంచి రూ.1,000 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిని అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టి, అడుగు రాళ్ల(బండరాళ్లు)ను తరలిస్తున్నారు.
రేగాటిపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు చిలకం మధుసూదన్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గతంలోనే ఆరోపించారు. అయినా అధికారుల్లో చలనం లేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
వరప్రసాద్, ఆర్డీవో, ధర్మవరం
క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో పరిశీలన చేసి అక్రమంగా తరలింపు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాము. తప్పనిసరిగా అనుమతులు తీసుకొని నిబంధనలు ప్రకారం మట్టి, రాళ్లను తరలించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
-
General News
Telangana News: మహబూబ్నగర్లో ఫ్రీడం ఫర్ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్
-
Movies News
kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
-
Politics News
Andhra News: మాధవ్ నగ్న వీడియో నకిలీది కాదు.. ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్: పట్టాభి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!