అడిగేవారు లేరని .. అడ్డంగా దోచుకొని..
అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా.. అధికారపార్టీ నాయకుల అండదండలతో కొందరు కొండలు, గుట్టలను అడ్డంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు, బంజర భూములు, గుట్టల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గో
చెరువులు, గుట్టల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
ధర్మవరం పట్టణం, న్యూస్టుడే: అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా.. అధికారపార్టీ నాయకుల అండదండలతో కొందరు కొండలు, గుట్టలను అడ్డంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువులు, బంజర భూములు, గుట్టల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. గోరంత అనుమతి ఉన్నా.. కొండంత తవ్వి వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. పలుచోట్ల ప్రమాదకరంగా తవ్వకాలు చేశారు.
ధర్మవరం పట్టణవాసులకు పోతులనాగేపల్లి రెవెన్యూ పొలంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. కొన్ని ప్రాంతాలు గుట్టలకు ఆనుకొని పేదలకు ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారు. ఇళ్లు కట్టుకునేందుకు కూడా వీలులేకుండా మట్టి తవ్వేశారు. అదేవిధంగా రేగాటిపల్లి గ్రామ కొండ పరిసర ప్రాంతాల్లో మట్టిని తరలించేశారు.
ఇలా వసూలు చేస్తున్నారు..
జగనన్న కాలనీలోని లేఅవుట్లలో పేదలు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. పునాది వేసేందుకు బండరాళ్లు అవసరం. ఇదే అవకాశంగా భావించి అధికార పార్టీ నాయకులు, వ్యాపారులు ట్రాక్టరు బండరాళ్లను రూ.1,000 నుంచి రూ.1,300 చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉన్న గుట్టలను తవ్వి ఈ బండరాళ్లను అనుమతి లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేవిధంగా చెరువులు, కుంటలు, కొండ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వి వాటిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు, పునాదులు పూడ్చడానికి ట్రాక్టరు మట్టిని రూ.800 నుంచి రూ.1,000 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిని అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు మట్టి, అడుగు రాళ్ల(బండరాళ్లు)ను తరలిస్తున్నారు.
రేగాటిపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు చిలకం మధుసూదన్రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గతంలోనే ఆరోపించారు. అయినా అధికారుల్లో చలనం లేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
వరప్రసాద్, ఆర్డీవో, ధర్మవరం
క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో పరిశీలన చేసి అక్రమంగా తరలింపు చేసి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాము. తప్పనిసరిగా అనుమతులు తీసుకొని నిబంధనలు ప్రకారం మట్టి, రాళ్లను తరలించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా